Nagarjuna- Tabu: నాగార్జున కి టబు కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

అయితే అప్పటికే నాగార్జున కి అమలకి పెళ్లి అయి అఖిల్ కూడా పుట్టాడు.అయితే నాగార్జున కి టబు కి మధ్య మంచి ఇష్టం ఏర్పడటంతో ఇద్దరు కూడా రిలేషన్ షిప్ లో ఉన్నారు.

Written By: Gopi, Updated On : September 27, 2023 10:13 am
Follow us on

Nagarjuna- Tabu: వెంకటేష్ హీరో గా వచ్చిన కూలీ నెంబర్ వన్ సినిమాతో టబు తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమాతోనే ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను తెచ్చుకుంది. దాంతో ఆమె కి తెలుగు లో మంచి అవకాశాలు వచ్చాయి. ఇక నాగార్జున హీరో గా చేసినప్పటికీ అఖిల్ ని లీడ్ రోల్ లో పెట్టీ తీసిన సిసింద్రీ సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ లో ఆడి పాడిన టబు కి నాగార్జున తో మంచి పరిచయం ఏర్పడింది. ఇక దాంతో కృష్ణ వంశీ తో నాగార్జున తీసే తన తదుపరి సినిమా నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నాగార్జున నే టబు ని రికమెండ్ చేసి మరీ ఈ సినిమా లో పెట్టించాడు. దాంతో ఆమె ఆ సినిమా లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది…అప్పటినుంచి నాగార్జున అంటే ఆమెకి చాలా ఇష్టం ఏర్పడింది…

అయితే అప్పటికే నాగార్జున కి అమలకి పెళ్లి అయి అఖిల్ కూడా పుట్టాడు.అయితే నాగార్జున కి టబు కి మధ్య మంచి ఇష్టం ఏర్పడటంతో ఇద్దరు కూడా రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇలా వాళ్లిద్దరూ కూడా ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఇక ఆమె కోసం నాగార్జున ఇల్లు, కారు లాంటివి కొనిచ్చి తనని కంప్లీట్ గా తన హ్యండవర్ లోకి తీసుకున్నాడు. దాంతో ఆమె చేసిన ప్రతి సినిమా ఎలా ఉండాలి, ఏం సినిమా చేయాలి అనేది కూడా నాగార్జుననే డిసైడ్ చేసేవాడు. ఇక వీళ్ళ కాంబో లో ఆవిడ మావిడే సినిమా వచ్చిన టైం లో వీళ్ల విషయం మొత్తం అమలకి తెలిసి నాగార్జునని అడిగితే నాగార్జున సరిగ్గా సమాధానం చెప్పకపోవడం తో అమల కూడా నాగార్జునని పట్టించుకోవడం మానేసింది. కానీ ఒకానొక టైం లో నాగార్జున టబు ని పెళ్లి చేసుకుందాం అని అనుకొని అమల కి విడాకులు ఇద్దాం అని చూసాడు. కానీ దానికి నిరాకరించిన అమల మాత్రం విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు అని అనడం తో నాగార్జున టబు వ్యవహారం అక్కడితో ఆగిపోయింది.అయితే అప్పట్లో వీళ్లిద్దరూ మధ్య ఎఫైర్ ఉంది అంటూ చాలా మీడియా సంస్థలు చాలా రకాలు గా న్యూస్ లు రాయడం కూడా మనం చూశాం…

అయితే టబు మాత్రం ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా తను ఒక్కతే ఒంటరి గా ఉండటం చూస్తున్న చాలా మంది నాగార్జున మీద ఆశతోనే తను ఇన్ని రోజులు ఇలా ఒంటరి గా ఉంటుంది. నాగార్జున అంటే తనకు చాలా ఇష్టం అతన్ని బాగా ప్రేమించింది కాబట్టే ఆయనకోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరి గా ఇలా ఉండిపోయింది అంటూ పలు రకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఆమె ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న నేపధ్యం లో వరుసగా అక్కడ సినిమాలు చేస్తూ బిజీ గా ఉంటుంది. ఇక టబు తెలుగులో అలా వైకుంఠపురం లో సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ కి తల్లి గా నటించి మంచి పేరు సంపాదించుకుంది…ఇక ఈవిడ ఎంత మంచి నటి గా గుర్తింపు పొందినప్పటికి 51 సంవత్సరాలు వచ్చిన పెళ్లి చేసుకోకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి…

ఇక ఈమె కి తెలుగులో మంచి అవకాశాలు వస్తె మళ్ళీ వరుసగా ఫుల్ లెంత్ రోల్స్ చేయడానికి ఆమె రెడీ గా ఉంది…అయితే ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్స్ ఆమెకి మంచి రోల్స్ ఉంటే చెప్తే ఆమె ఆ క్యారెక్టర్లు చేయడానికి ఎప్పుడు కూడా రెఢీ గా ఉంటాను అని అలా వైకుంఠపురం లో మువీ ఈవెంట్ లో కూడా తను చెప్పడం జరిగింది…