Additional DGP Madireddy Pratap: కొంతమంది ఉన్నత స్థానాలకు వెళ్తే తమ మూలాలను మరిచిపోతారు. కనీసం గుర్తు పెట్టుకోరు కూడా. మరికొందరైతే తమకు తెలియదు అన్నట్టు ఉంటారు. అందుకు భిన్నంగా ఓ పోలీసు ఉన్నతాధికారి తన మూలాలను గుర్తు చేసుకుంటూ తన స్వగ్రామానికి వెళ్లారు. ప్రాథమిక స్థాయిలో తాను పడిన కష్టాలను, చేసిన పనులను ఇష్టంగా చెప్పుకున్నారు. తనను ఈ స్థాయికి ఎదిగేలా చేసినందుకు గురుభక్తి చాటుకున్నారు. గురువులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనే అడిషనల్ డీజీపీ మాదిరెడ్డి ప్రతాప్. ఏపీ రోడ్డు సేఫ్టీ అధారిటీ చైర్మన్ గా, అదనపు డీజీపీ క్యాడర్ అధికారిగా ఉన్నారు. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు.. ఈ సందర్భంగా తన సొంత ఊరిని వెతుక్కుంటూ వెళ్లి అక్కడ ఆత్మీయులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. అప్పటి గురువుల ఆశీస్సులను పొందారు.
Also Read: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..
* నరసరావుపేటలోనే విద్య..
మాదిరెడ్డి ప్రతాప్ సొంత గ్రామం నరసరావుపేట. 1982లో స్థానికంగా ఉన్న ఎస్కేఆర్బిఆర్ స్కూల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ఉన్నత చదువులతో ఐపీఎస్ అధికారి అయ్యారు. ప్రస్తుతం అడిషనల్ డీజీపీ క్యాడర్ తో రహదారి భద్రత విభాగం చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. అయితే తన ఈ స్థాయికి కారణమైన గురువులను కలుసుకొని వారిని సన్మానించారు. అది కూడా పోలీసు యూనిఫామ్ తో కావడం గమనార్హం.
* చిన్ననాటి విషయాలను గుర్తు చేస్తూ..
పదవీ విరమణ చేయనున్న మాదిరెడ్డి ప్రతాప్ తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.. తాను నరసరావుపేటలో పుట్టి పెరిగానని.. ఈ ప్రాంతంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను కష్టపడి చదువుకొని ఐపీఎస్ అధికారిగా ఎదిగిన విషయాన్ని ప్రస్తావించారు. తన తండ్రి వ్యవసాయం చేసే వారిని.. తన తల్లి పాలు విక్రయిస్తూ తనను ఇంతటి వాడిని చేశారని ఎమోషనల్ అయ్యారు. తాను కూడా పాలు పోసే వాడినని నాట్ సంగతులను గుర్తు చేసుకున్నారు. తనకు ఉద్యోగ జీవితం ఎంతో సంతృప్తి ఇచ్చిందని.. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వాల్లో తాను కీలక బాధ్యతలు నిర్వహించామన్నారు. హైదరాబాదులో ఐటీ పరిశ్రమకు చంద్రబాబు ఆధ్యుడు అని పేర్కొన్నారు. అమరావతికి రైతులు ఉచితంగా భూములు ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. వారి త్యాగానికి, సౌందర్యానికి విలువ కట్టలేమని చెప్పారు. ఈ సందర్భంగా మాదిరెడ్డి ప్రతాప్ కు నరసరావుపేటలో ఆత్మీయ సత్కారాలు, సన్మానాలు జరిగాయి.
