Pallavi Prashanth: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రైజ్ మనీ రైతులకు ఇచ్చాడా?

సాధారణ రైతు బిడ్డ టైటిల్ గెలవడం అందరినీ ఆకర్షించింది. అనూహ్యంగా అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

Written By: S Reddy, Updated On : March 1, 2024 6:25 pm
Follow us on

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఒక సంచలనం. కామన్ మ్యాన్ గా హౌస్ లో అడుగుపెట్టాడు. ఎటువంటి ఫ్యాన్ బేస్ లేని పల్లవి ప్రశాంత్, సెలెబ్రెటీలతో పోటీ పడి టైటిల్ గెలిచి రికార్డు క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ షో కారణంగా పల్లవి ప్రశాంత్ రేంజ్ మారిపోయింది. ఊరిలో పొలం పనులకు సంబంధించిన రీల్స్ చేసుకునే పల్లవి ప్రశాంత్.ప్రస్తుతం కార్లలో తిరుగుతున్నాడు. ఎక్కడకు వెళ్లినా అతన్ని జనాలు గుర్తిస్తున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు.

సాధారణ రైతు బిడ్డ టైటిల్ గెలవడం అందరినీ ఆకర్షించింది. అనూహ్యంగా అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. బయటకు వచ్చిన తర్వాత కొంత కాలం హైదరాబాద్ లో ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో కలిసి పలు ఈవెంట్స్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. పెద్దగా కనిపించడం లేదు తన యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోలు ఏమి పోస్ట్ చేయలేదు.

దీంతో ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు. ప్రస్తుతం ప్రశాంత్ ఏం చేస్తున్నాడు. బిగ్ బాస్ తర్వాత ఎలా ఉన్నాడు అని అందిరిలో ఒక ఆసక్తి ఉంది. సెలెబ్రిటీ హోదా ఎంజాయ్ చేస్తున్న పల్లవి ప్రశాంత్… తన వృత్తిని మాత్రం విడిపెట్టకుండా కొనసాగిస్తున్నాడు. పొలం పనుల్లో తన తండ్రికి సహాయం చేస్తూ .. అప్పుడప్పుడు సరదాగా ఆయనతో కలిసి రీల్స్ చేస్తున్నాడు. తాజాగా తన పేరెంట్స్ తో బంతి పూల తోటలో రీల్స్ చేయించాడు.

ఆ రీల్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. సమ్మక్క సారక్క జాతరకు కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు. అయితే పల్లవి ప్రశాంత్ తన హామీ నెరవేర్చిన దాఖలాలు లేవు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ కొడితే ప్రైజ్ మనీ పేదలకు పంచుతానని హౌస్లో హామీ ఇచ్చాడు. బహుమతులు కాకుండా… పల్లవి ప్రశాంత్ కి రూ. 35 లక్షలు దక్కాయి. ఇందులో టాక్స్ మినహాయించగా మిగిలింది రైతులకు పంచాలి. కానీ పల్లవి ప్రశాంత్ ఆ దిశగా అడుగులు వేసినట్లు లేదు.