విశాల్‌, ఆర్యల భారీ మ‌ల్టీస్టార‌ర్ ‘ఎనిమీ’

ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. గతంలో బాలా రూపొందించిన `వాడు-వీడు` సినిమాలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్. వీరిద్ద‌రు పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి మ‌రో భారీ చిత్రంలో క‌లిసి నటిస్తున్నారు. ఈ మూవీ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. […]

Written By: Neelambaram, Updated On : November 27, 2020 7:47 pm
Follow us on


ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. గతంలో బాలా రూపొందించిన `వాడు-వీడు` సినిమాలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్. వీరిద్ద‌రు పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి మ‌రో భారీ చిత్రంలో క‌లిసి నటిస్తున్నారు. ఈ మూవీ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రానికి `ఎనిమీ` అనే పేరును అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్. ఇది యాక్ష‌న్ హీరో విశాల్ కు 30వ చిత్రం కాగా, ఆర్య‌కు 32వ సినిమా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ ప‌తాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: పవన్ కి కూతురులా ఉంటుంది.. ఆమె హీరోయిన్ ఏంటి ?

ఈ చిత్రంలో విల‌క్షణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన మృణాళిని ర‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్ ‌డి రాజ‌శేఖ‌ర్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తుండ‌గా, లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. తెలుగు, తమిళంలో పాటు మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుద‌ల‌కానుంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది చిత్రయూనిట్.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్