Vijayendra Prasad: మహేష్-రాజమౌళి మూవీ సంచలన అప్టేట్ చెప్పిన విజయేంద్రప్రసాద్…

మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇప్పటికే మహేష్ బాబు అమెరికాకి వెళ్ళారు అక్కడ ఒక ఆరు రోజుల పాటు ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ లో మహేష్ బాబు పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Srinivas, Updated On : January 20, 2024 10:33 am

Vijayendra Prasad

Follow us on

Vijayendra Prasad: కొంతమంది దర్శకులు ఏ సినిమా తీసిన కూడా సెన్సేషన్ అవుతుంది.అందులో రాజమౌళి ఒకడు. ఈయన సినిమా కోసం ప్రస్తుతం ప్రపంచ మంత ఎదురు చూస్తుందనే చెప్పాలి. ఇక ఇంతకుముందు ఈయన చేసిన బాహుబలి త్రిబుల్ ఆర్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలు మంచి రికార్డులను కూడా నెలకొల్పాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయడానికి రాజమౌళి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాతో మరొకసారి పాన్ వరల్డ్ లో తన మార్క్ చూపించడానికి రాజమౌళి చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాతో ఫుల్ గా పాన్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్నాడు… ఇక ఇప్పుడు ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్ ని ఈ సినిమా రైటర్ అయిన విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిపోయిందని ఇక షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం అంటూ తను ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ఇక దీంతో మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇప్పటికే మహేష్ బాబు అమెరికాకి వెళ్ళారు అక్కడ ఒక ఆరు రోజుల పాటు ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ లో మహేష్ బాబు పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా కొన్ని బయటికి వచ్చాయి అవి ఏంటి అంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక అడ్వెంచర్ ని చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.ఇది ఒక నిధి చుట్టూ తిరిగే కథ గా తెలుస్తుంది దాని కోసం మహేష్ చాలా ఫీట్లు చేస్తాడని కూడా తెలుస్తుంది. దానికోసం ప్రస్తుతం మహేష్ బాబు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక నిజానికి ఈ సినిమాతో మహేష్ బాబు చాలా కష్టపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన ఇంతవరకు ఏ సినిమాలో కూడా పెద్దగా కష్టపడలేదు కానీ ఈ సినిమాలో రాజమౌళి కష్టపెట్టడమే కాకుండా తన నుంచి పూర్తి అవుట్ పుట్ ని తీసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…