
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.అన్నట్టుంది మెగా మేనల్లుడి సినిమా పరిస్థితి .ప్రతిరోజూ పండగే ఫేమ్ సాయిధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ చిత్రం రూపొందింది. తెలుగులో అతనికి ఇదే తొలి చిత్రం అలాగే కథానాయిక కృతి శెట్టి ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయ మవుతోంది. అలాగే వీరిద్దరితో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా తెలుగు తెరకి పరిచయం కాబోతున్నాడు. సుకుమార్ శిష్యుడైన దర్శకుడు బుచ్చిబాబుకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాలో విలన్ గా తమిళ్ హీరో విజయ్ సేతుపతి నటించడం..
ఏప్రిల్ రెండవ తారీఖున విడుదల కావలసిన “ఉప్పెన ” సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. కొత్త దర్శకుడు ,కొత్త హీరో , కొత్త హీరోయిన్ ల కలయికలో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు 22 కోట్ల భారీ బడ్జట్ తో నిర్మించారు.వారికీ సినిమా మీదున్న అపారమైన నమ్మకం తో సొంతంగా విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఇక సినిమాలో కీలకమైన విలన్ పాత్ర పోషిస్తున్న విజయ్ సేతుపతి ఈ చిత్రం యొక్క ఔట్పుట్ చూసి తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించు కోవడంతో పాటు , రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశాడట. కాగా ఈ చిత్రం యొక్క తమిళ్ వెర్షన్ కి నిర్మాణ భాగస్వాములుగా మైత్రి మూవీస్ వారు ఉంటారని తెలుస్తోంది. … తెలుగులో విజయ్ సేతుపతి చేసిన పాత్రను, తమిళంలో కూడా ఆయనే చేస్తాడని తెలుస్తోంది .ఇక ఈ చిత్రం లోని పాటలు తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూత లూగిస్తూ, చార్ట్ బస్టర్స్ గా మారడం తో సినిమా ఫై అంచనాలు భారీగా పెరిగాయి. .