Vijay Deverakonda: నేటి తరం జెన్ జీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. కెరీర్ లో ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాల్లో సూపర్ హిట్స్ గా నిలిచినవి కేవలం 3 మాత్రమే , కానీ ఫ్యాన్ బేస్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది. ముఖ్యంగా జెన్ జీ లేడీస్ అయితే విజయ్ దేవరకొండ పేరు తీస్తేనే పిచ్చెక్కిపోతుంటారు. అందంగా ఉండడమే కాకుండా యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉండడం వల్లే విజయ్ దేవరకొండ కి ఎన్ని ఫ్లాప్స్ వచ్చినప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు. నిర్మాతలు కూడా విజయ్ దేవరకొండ తో సరైన సినిమా తీస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేయొచ్చు అనే నమ్మకం తో ఉన్నారు కాబట్టే , ఆయనతో వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతుల్లో ‘రణబలి’, ‘రౌడీ జనార్ధన’ అనే చిత్రాలు ఉన్నాయి.
ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ లో సమాంతరంగా పాల్గొంటూ ఫుల్ బిజీ గా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్లింప్స్ వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే నేడు ఉదయం నుండి ఒక ప్రముఖ వెబ్ సైట్ లో వచ్చిన ఆర్టికల్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతూ , విజయ్ దేవరకొండ పై తీవ్రమైన నెగెటివిటీ ని పెంచేలా చేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘రణబలి’ ని నిమిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ని విజయ్ దేవరకొండ టార్చర్ చేస్తున్నాడని , షూటింగ్ లొకేషన్ లో కేవలం ఆయన కోసమే 5 క్యారవాన్ లు ఉపయోగించాలని , అదే విధంగా తన బాగోగులు చూసుకోవడానికి ఏకంగా 40 మంది అసిస్టెంట్లను అడిగాడని , దీంతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో విజయ్ దేవరకొండ పై ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యిందని , ఇలా పలు రకాల వార్తలు ప్రచారం చేశాయి.
ఇక సోషల్ మీడియా లో విజయ్ దేవరకొండ మరియు నాని అభిమానుల మధ్య ఏ రేంజ్ లో ఫ్యాన్ వార్స్ నడుస్తుంటాయి మన కళ్లారా ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాం. ఈ అంశాన్ని పట్టుకొని నాని ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ గా వెలుగు వెలుగుతున్న ప్రభాస్, అల్లు అర్జున్ , రామ్ చరణ్ లాంటోళ్ళు కూడా ఈ రేంజ్ కోరికలు కోరరు కదా, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్? అంటూ విజయ్ దేవరకొండ ని ట్యాగ్ చేసి పోస్టులు వేస్తున్నారు. అయితే ఆ ఆర్టికల్ బాగా వైరల్ అవ్వడం తో , సదరు వెబ్ సైట్ స్పందించింది. మా సైట్ నుండి ఈ ఆర్టికల్ పడలేదని , ఇది ఫేక్ గా ఎవరో క్రియేట్ చేసారని , త్వరలోనే వాళ్లెవరో కనిపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని ఒక ట్వీట్ వేశారు.
