Oscar Awards: ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ” ఆస్కార్” ముందు వరసలో ఉంటుంది. తాజాగా ఈ యేడాది ఆస్కార్ బరిలో విదేశీ చిత్రాల కేటగిరిలో మన దేశం తరుపున నయనతార, విఘ్నేష్ శివన్ల ‘కూజంగల్’ మూవీని ఎంపిక చేశారు.
తాజాగా 2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కెేటగిరిలో పోటీ పడేందకు మన దేశం తరుపున అధికారిక ఎంట్రీ కోసం పలు సినిమాలు పోటీ పడ్డాయి. ఇందుకొరకు కేంద్రం 15 మంది సభ్యులతో ఓ జ్యూరీని ఏర్పాటు చేసింది. ఇందులో మన దేశం నుంచి ఎంపిక చేసిన 14 సినిమాలను చూసి ఫైనల్గా ” కూజంగల్ ” సినిమాని మన దేశం తరుపున ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో అధికారిక ఎంట్రీగా ఎంపికైంది.
ఈ మేరకు ఆస్కార్ బరిలో ఈ సినిమా నిర్మాత విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా ఈ వార్తను పంచుకున్నారు. మా కూజంగల్ సినిమా అధికారికంగా ఎంపికైన నేపథ్యంలో… ఆస్కార్కు రెండడుగుల దూరం ఉందంటూ పోస్ట్ చేశారు. ఈ మేరకు ఒక ఫోటోను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
https://twitter.com/VigneshShivN/status/1451812441281613830?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1451812441281613830%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2Foscar-2022-nayanthara-vignesh-shivans-tamil-movie-koozangal-is-indias-offcially-entry-for-oscar-2022-indian-official-entry-ta-1064126.html
ఈ సినిమాలో చెల్లపండి, కరుత్తాదైయాన్ ముఖ్యపాత్రల్లో పోషించారు. పి.ఎస్. వినోద్ రాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ‘కూజంగల్’ మూవీని నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ప్రఖ్యాత ప్రెస్టీజియస్ టైగర్ అవార్డు ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైంది. అంతేకాదు 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించబడింది. ఈ వార్తతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు వారికి విశేస్ చెబుతున్నారు.