భీష్మా డైరెక్టర్ కు మహేష్ బంపర్ ఆఫర్

‘ఛలో’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన దర్శకుడు వెంకీ కుడుముల.. మొదటిసినిమాతోనే మంచి విజయం సాధించాడు, చాలా గ్యాప్ తరువాత ‘భీష్మ’ తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి పేరును తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ దర్శకుడికి స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ వచ్చింది. అందులో భాగంగానే చాలా మంది హీరోల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ దర్శకుడికి సూపర్ స్టార్ మహేష్ […]

Written By: admin, Updated On : March 17, 2020 5:59 pm
Follow us on

‘ఛలో’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన దర్శకుడు వెంకీ కుడుముల.. మొదటిసినిమాతోనే మంచి విజయం సాధించాడు, చాలా గ్యాప్ తరువాత ‘భీష్మ’ తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి పేరును తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ దర్శకుడికి స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ వచ్చింది. అందులో భాగంగానే చాలా మంది హీరోల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ దర్శకుడికి సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.

తాజాగా మహేష్ బాబు భీష్మ సినిమాని వీక్షించారు. ఈ సినిమా బాగా నచ్చడంతో మహేష్ బాబు వెంకీ టేకింగ్ తో తనకు సెట్ అయ్యేలా ఓ మంచి కథను కూడా సిద్ధం చెయ్యమన్నాడు అని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వెంకీ అదే పనిలో ఉన్నాడట! ఇదే నిజమైతే మహేష్ ని డైరెక్ట్ చేసే రోజు వెంకీకి దగ్గరలోనే ఉందన్నమాట!

ఈ ఏడాదిలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. థ్రిల్లర్ స్టోరీతో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలో సినిమా పట్టలేక్కనుంది.