Venkatesh rejected 500 crore movie: కొన్ని చిత్రాలను వదులుకున్నప్పుడు, అవి కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ గా హిట్ అయ్యినప్పుడు , అయ్యో మా హీరో బంగారం లాంటి సినిమాని మిస్ చేసుకున్నాడే అని బాధ పడుతుంటాము , ఇలాంటి సందర్భాలు దాదాపుగా ఇండియా లో ప్రతీ హీరో అభిమానికి కూడా వచ్చే ఉంటుంది. రీసెంట్ గా అలాంటి సందర్భం విక్టరీ వెంకటేష్ కి కూడా వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే , ఆయన కెరీర్ లో మైలు రాయి లాగా నిల్చిపోయిన చిత్రాల్లో ఒకటి ‘దృశ్యం’. మిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా , మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘దృశ్యం’ చిత్రానికి రీమేక్. అక్కడ మోహన్ లాల్ హీరో గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమాని తెలుగు లో వెంకటేష్ తో , తమిళం లో కమల్ హాసన్ తో , హిందీ లో అజయ్ దేవగన్ తో తెరకెక్కించారు.
ఈ చిత్రానికి సీక్వెల్స్ కూడా వచ్చాయి. తెలుగు , మలయాళం భాషల్లో సీక్వెల్స్ కరోనా లాక్ డౌన్ సమయం లో రెడీ అయ్యాయి. అప్పటికి థియేటర్స్ అన్నీ క్లోజ్ ఉండడం తో ఈ రెండు చిత్రాలను అమెజాన్ ప్రైమ్ వీడియో లో నేరుగా విడుదల చేశారు. రెండిటికి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది . కానీ హిందీ లో అజయ్ దేవగన్ లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విడుదల చేయగా, ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. అప్పుడు తెలుగు , మలయాళం ఒరిజినల్ మేకర్స్ , అయ్యో అనవసరంగా థియేటర్స్ లో విడుదల చేయకుండా పెద్ద పొరపాటు చేశామే అని బాధ పడ్డారు . అయితే రీసెంట్ గానే మలయాళం లో మోహన్ లాల్ ‘దృశ్యం 3’ చిత్రాన్ని పూర్తి చేసాడు.
ఈ నెల 21 న మలయాళం , తమిళం, తెలుగు , కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా, బుక్ మై షో లో అద్భుతమైన రెస్పాన్ వచ్చింది. బుక్ మై షో గణాంకాల ప్రకారం ఈ చిత్రానికి గడిచిన 24 గంటల్లో 21 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అతి తక్కువ షోస్ నుండి ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిందంటే , పూర్తి స్థాయిలో బుకింగ్స్ ప్రారంభిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ చిత్రానికి నమోదు అవుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే కచ్చితంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసేలా అనిపిస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మలయాళం లోనే ఆ రేంజ్ వసూళ్లు వస్తే , తెలుగు లో వెంకటేష్ కి ఉన్నటువంటి ప్రస్తుత పీక్ మార్కెట్ లో 500 కోట్ల గ్రాస్ ని రాబట్టి ఉండేదని , మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.