Varalakshmi Sarath Kumar : తమిళ వరలక్ష్మికి పెళ్లి కుదిరింది.. నిశ్చితార్థమూ ముగిసింది.. భర్త ఎవరో తెలుసా?

అన్నట్టు మొన్నటిదాకా వరలక్ష్మి మీద విపరీతంగా రూమర్స్ రాసిన తమిళ మీడియా.. ఇప్పుడిక కొత్త తారను వెతుక్కోవాలి. ఎందుకంటే రూమర్స్ సృష్టించందే మీడియాకు నిద్ర పట్టదు కదా అని వరలక్ష్మి అభిమానులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Written By: NARESH, Updated On : March 2, 2024 9:06 pm
Follow us on

Varalakshmi Sarath Kumar : విశాల్ తో ప్రేమ బంధం ఉందని..అది బ్రేకప్ అయిపోయిందని.. ఇక ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకోదని వరలక్ష్మి గురించి తమిళ మీడియా సమయం దొరికినప్పుడల్లా రాసింది. మొదట్లో కొంత ఇబ్బంది పడింది. తర్వాత అలవాటు పడింది. వీటన్నిటిని వరలక్ష్మి లైట్ తీసుకుంది. వాస్తవానికి ఆమె గతంలో ప్రేమలో ఉందా? ఉంటే ఎవరితో ఉంది? ఎందుకు విడిపోయింది? 38 సంవత్సరాలు వచ్చేదాకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇవన్నీ ఆమె వ్యక్తిగతం.. కానీ ఇప్పుడు ఆమె సడన్ గా వార్తల్లో వ్యక్తి ఎందుకు అయిందంటే.. వరలక్ష్మి కి పెళ్లి కుదిరిందట.. నిశ్చితార్థం కూడా పూర్తయిందట.. ఇవన్నీ ఏదో మీడియా కల్పితం కాదు. ఆమె కుటుంబ సభ్యులు చెప్పిందే. వరలక్ష్మి సవతి తల్లి రాధిక తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఈ విషయాన్ని ప్రకటించింది.

వరలక్ష్మి హీరోయిన్ పర్సనాలిటీ. కానీ డిఫరెంట్ గా తన కెరియర్ ప్లాన్ చేసుకుంది. విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించింది. ఓ క్రాక్, నాంది, తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి, కోటబొమ్మాలి పిఎస్, ఇక తమిళంలో అయితే మంచి మంచి పాత్రలే పడ్డాయి. పెళ్లి విషయం తీసుకొచ్చేటప్పటికి ఒకరకంగా మీడియాపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసేది. నాకు చాలాసార్లు పెళ్లి చేశారు కదా.. కొత్తగా పెళ్లి గురించి అడుగుతున్నారు ఏంటి అని ఎదురు ప్రశ్న వేసేది. అయితే అలాంటి వరలక్ష్మి తన పెళ్లికి సంబంధించి, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వస్తున్న రూమర్లకు మొత్తానికి చెక్ పెట్టింది.

అతడి పేరు నికోలయ్ సచ్ దేవ్. చాలా రోజుల నుంచి అతని కుటుంబం ముంబైలో ఉంటోంది.. అతడు సినిమా రంగానికి చెందినవాడు కాదు. ఏదో గ్యాలరీ వర్క్ చేస్తాడట. సచ్ దేవ్, వరలక్ష్మి మధ్య 14 సంవత్సరాల పరిచయం ఉందట.. వారు తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు నిర్ణయించుకుని ముంబైలో అతి కొద్ది మంది సమక్షంలో శుక్రవారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఏడాది చివర్లో పెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.. నిశ్చితార్థ వేడుకకు రాధిక, శరత్ కుమార్, ఇంకా కొంతమంది కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను రాధిక శరత్ కుమార్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అన్నట్టు మొన్నటిదాకా వరలక్ష్మి మీద విపరీతంగా రూమర్స్ రాసిన తమిళ మీడియా.. ఇప్పుడిక కొత్త తారను వెతుక్కోవాలి. ఎందుకంటే రూమర్స్ సృష్టించందే మీడియాకు నిద్ర పట్టదు కదా అని వరలక్ష్మి అభిమానులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.