Upasana Ramcharan: తల్లి, రామ్ చరణ్ కోసం పంతాన్ని పక్కన పెట్టిన ఉపాసన? ఇంతకు ఏం చేసిందంటే..

ఈ జంటకు పెళ్లి జరిగి 10 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టలేదు. అయినా కూడా వీరి మధ్య మనస్పర్థలు రాలేదు. విడాకులు తీసుకోలేదు. చివరగా ఈ సంవత్సరమే వీరికి చిన్నారి జన్మించింది.

Written By: Suresh, Updated On : October 28, 2023 1:04 pm

Upasana Ramcharan

Follow us on

Upasana Ramcharan: తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్. మొదట్లో ఎన్నో విమర్శల పాలైన చెర్రీ ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరోగా తన సత్తా చాటుతున్నారు. హీరోకి పనికి రాడు అనే కామెంట్లు నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గ్రేట్ ఆక్టర్ అనిపించుకున్నారు. సినిమాల్లోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా మంచి స్టేటస్ ను సంపాదించారు చెర్రీ. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎలాంటి రూమర్ బయటకు రానివ్వకుండా ఆదర్శ దంపుతులుగా వెలుగుతున్నారు ఉపాసన, రామ్ చరణ్. అయితే ఉపాసన చెర్రీ కోసం తన పంతాన్ని కూడా పక్కన పెట్టిందట. ఇంతకీ ఏ విషయంలో పంతాన్ని పక్కన పెట్టిందో తెలుసా?

ఈ జంటకు పెళ్లి జరిగి 10 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టలేదు. అయినా కూడా వీరి మధ్య మనస్పర్థలు రాలేదు. విడాకులు తీసుకోలేదు. చివరగా ఈ సంవత్సరమే వీరికి చిన్నారి జన్మించింది. ఆమెకు క్లింకారా అనే నామకరణం చేశారు మెగా ఫ్యామిలీ. అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్న ఈ జంట కుటుంబ బాధ్యతలను కూడా చక్కగా తీర్చిదిద్దుతుంటారు. అయితే పెళ్లి తర్వాత కొంత కాలం పాటు చిరు ఫ్యామిలీతో కాకుండా.. కొత్త ఇల్లు తీసుకొని అక్కడికి షిప్ట్ అయ్యారు. కానీ పాప పుట్టిన తర్వాత పిల్లలు తాతయ్య, నానమ్మ దగ్గర ఉంటేనే బాగుంటారు అనే ఉద్దేశ్యంతో.. ఈ దంపతులు మళ్లీ చిరు ఇంటికి షిప్ట్ అయ్యారట.

ఉపాసన తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలే. మగ సంతానం లేకపోవడంతో వీరినే మగపిల్లల్లాగా పెంచారట. ధైర్యంగా వారిని ముందుకు నడిపించారట. తల్లి తండ్రి ప్రోద్బలంతో ఉపాసన తన సోదరి ఇద్దరు కూడా వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. అంతే కాదు సక్సెసై చూపించారు ఈ అక్కాచెల్లెళ్లు. అయితే కొడుకులు లేరని.. తల్లిదండ్రిని తానే దగ్గర ఉండి చూసుకోవాలని కలలు కన్నదట ఉపాసన. దీంతో పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్లే ఆలోచనను పక్కన పెట్టిందట. పెళ్లి చేసుకున్నా కూడా భర్తను ఇంటికి తీసుకొని రావాలని.. తాను మాత్రం మెట్టింటికి వెళ్లేది లేదని అనుకుందట.

రామ్ చరణ్ తో ప్రేమలో పడిన ఉపాసన ఇదే విషయాన్ని ఆయనకు కూడా చెప్పిందట. కానీ తన తల్లి శోభ ఆడపిల్ల జీవితం, ఆమె నిర్వర్తించాల్సిన పనులు అన్నింటిని కూర్చోబెట్టుకొని మరీ చెప్పడంతో ఉపాసన తన నిర్ణయం మార్చుకుందట. అంతేకాదు చరణ్ పై ఉన్న ప్రేమతో కూడా తన నిర్ణయం మార్చుకుందని టాక్. కానీ మొత్తం మీద తన పంతం మాని మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఉత్తమ కోడలుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది కొణిదెల ఉపాసన.