
మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘ఉప్పెన’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడగా, షూటింగులు వాయిదాపడ్డాయి. రెండు నెలలుగా థియేటర్లు మూతపడటంతో కొన్ని సినిమాలు ఓటీటీ ఫాట్ ఫామ్స్ లో రిలీజవుతున్నాయి. దీంతో వైష్ణవ్ తేజ్ డెబ్ల్యూ మూవీ కూడా ఓటీటీ రిలీజవుతుందనే ప్రచారం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో చిత్రబృందం దీనిపై క్లారిటీ ఇచ్చింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ మూవీ ఓటీటీ రిలీజ్ చేయడంలేదని ఖచ్చితం థియేటర్లలోనే రిలీజు కానుందని స్పష్టం చేశారు.
దేశంలో లాక్డౌన్ 4.0 మే 31వరకు కొనసాగనుంది. ఇప్పటికే కేంద్రం దాదాపుగా అన్ని పరిశ్రమలు, ప్రజారవాణాకు అనుమతించింది. ట్రైన్లు, విమాన సర్వీసులు, థియేటర్లు, షూటింగులు, మాల్స్, దేవాలయాలకు మాత్రమే సడలింపులు ఇవ్వలేదు. లాక్డౌన్ 4.0తర్వాత వీటికి కూడా అనుమతి లభించే అవకాశం మెరుగ్గా ఉంది. దీంతో మరో రెండు మూడు నెలల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోవడం ఖాయంగా కన్పిస్తుంది. దీంతో నిర్మాతలు ఆగస్టులో సినిమాలను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ జూలైలో థియేటర్ల ఓపెన్ అయితే చిన్న సినిమాలను ముందుగా రిలీజు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
ఇప్పటికే ‘ఉప్పెన’ మూవీ రిలీజుకు సిద్ధంగా ఉంది. లాక్డౌన్ లేకుండా ఉంటే ఇప్పటికే థియేటర్లలో సందడి చేసేది. ఈ సినిమాకు సంబంధించి ఒక సెన్సాన్స్ ఒక్క బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా పూర్తి చేసుకొని ఆగస్టు 15న సినిమాను రిలీజు చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సేతుపతి ఓ ముఖ్య పాత్రలో నటించాడు. ఉప్పెన రిలీజ్ తేదీని చిత్రబృందం జూన్లో అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.