మెగా హీరో తో కన్నడ స్టార్

గత ఏడాది `ఎఫ్ 2`, `గద్దల కొండ గణేష్` చిత్రాలతో వరుస విజయాలను చవి చూసిన గ్లామర్ స్టార్ వరుణ్ తేజ్ ఇపుడు మరిన్ని వైవిధ్య భరిత చిత్రాలకు శ్రీకారం చుట్టాడు.. ఆ క్రమంలో వరుణ్ తేజ్ ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాలో ఆక్ట్ చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్ లో ఒక షెడ్యూల్ జరుపుకొంది. రెండో షెడ్యూల్ త్వరలో జరుపుకో బోతోంది.అదలా ఉంటే తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో […]

Written By: Neelambaram, Updated On : March 12, 2020 2:48 pm
Follow us on

గత ఏడాది `ఎఫ్ 2`, `గద్దల కొండ గణేష్` చిత్రాలతో వరుస విజయాలను చవి చూసిన గ్లామర్ స్టార్ వరుణ్ తేజ్ ఇపుడు మరిన్ని వైవిధ్య భరిత చిత్రాలకు శ్రీకారం చుట్టాడు.. ఆ క్రమంలో వరుణ్ తేజ్ ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాలో ఆక్ట్ చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్ లో ఒక షెడ్యూల్ జరుపుకొంది. రెండో షెడ్యూల్ త్వరలో జరుపుకో బోతోంది.అదలా ఉంటే తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించడానికి ఈ చిత్ర యూనిట్ కన్నడ స్టార్ ఉపేంద్రతో చర్చలు జరుపుతున్నారట. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఉపేంద్ర తెలుగులో నటించలేదు. కన్నడ సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న ఉపేంద్రని మళ్లీ తెలుగులో నటింపచేయడానికి చర్చలు జరుపుతున్నారట.

కాగా ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది.. ఇక సినిమాను ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ విన్నర్ టోని జెఫ్రీస్ దగ్గర బాక్సింగ్ లో ప్రత్యేకమైన శిక్షణను తీసుకున్నాడు. . ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
A good combination makes better buzz