Viral Pics: ఉపాసనతో నమ్రత.. మహేష్, మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సంబరాలు.. వైరల్ పిక్స్

ఉపాసన కొణిదెల-నమ్రత శిరోద్కర్ క్రిస్మస్ వేడుకలు కలిసి జరుపుకున్నారు.డిసెంబర్ 25 రాత్రి హైదరాబాద్ లో క్రిస్మస్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఉపాసన, నమ్రతల కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.

Written By: Neelambaram, Updated On : December 26, 2023 12:02 pm
Follow us on

Viral Pics: మెగా ఫ్యామిలీ-ఘట్టమనేని క్రిస్మస్ వేడుకల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. క్రిస్మస్ యూనివర్సల్ ఫెస్టివల్. కుల మత బేధాలు లేకుండా అందరూ జరుపుకుంటారు. సెలెబ్స్ మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇక టాలీవుడ్ కి చెందిన పలువురు హీరోలు, హీరోయిన్స్ కుటుంబ సమేతంగా క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. అయితే ఘట్టమనేని-కొణిదెల ఫ్యామిలీస్ కలిసి చేసుకున్న క్రిస్మస్ పార్టీ అందరినీ ఆకర్షించింది.

ఉపాసన కొణిదెల-నమ్రత శిరోద్కర్ క్రిస్మస్ వేడుకలు కలిసి జరుపుకున్నారు.డిసెంబర్ 25 రాత్రి హైదరాబాద్ లో క్రిస్మస్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఉపాసన, నమ్రతల కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. క్రిస్మస్ వేడుకలు కావడంతో రెడ్ అవుట్ ఫిట్ లో సందడి చేశారు. ఈ క్రిస్మస్ పార్టీ ఫోటోలు నమ్రత శిరోద్కర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఫ్యాన్స్ సైతం తిరిగి నమ్రతకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.

నమ్రత-ఉపాసనల క్రిస్మస్ పార్టీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకల్లో నమ్రత పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార కూడా పాల్గొన్నారు. మహేష్, రామ్ చరణ్ పరిశ్రమలో బెస్ట్ ఫ్రెండ్స్. వీరి సతీమణులు ఉపాసన, నమ్రత బెస్ట్ ఫ్రెండ్స్. తరచుగా కలుస్తూ ఉంటారు. మేఘ కృష్ణారెడ్డి ఇటీవల ఏర్పాటు చేసిన ప్రైవేట్ పార్టీలో మహేష్, రామ్ చరణ్ కుటుంబాలు పాల్గొన్నారు.

అయితే ఈ క్రిస్మస్ పార్టీలో మహేష్ బాబు, రామ్ చరణ్ మిస్ అయ్యారు. వీరిద్దరూ హాజరు కాకపోవడం చర్చకు దారి తీసింది. బహుశా షూటింగ్స్ లో లేదా ఇతర పనుల్లో బిజీగా ఉండి హాజరుకాకపోయి ఉండొచ్చనే వాదన వినిపిస్తుంది. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12 ఇది విడుదల కానుంది. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నారు.