రెండు రీమేక్‌లు.. రెండు ఫ్లాష్‌బ్యాక్‌లు..

అటు రాజకీయాల్లోనూ.. ఇటు సినిమాల్లోనూ బిజీ అయిపోయారు పవర్‌‌ స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌. రాజకీయంగా పార్టీని నడిపిస్తూనే.. మరోవైపు తన కెరీర్‌‌ను కారణమైన సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా.. పవర్‌‌ స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌ రెండు రీమేక్‌లు చేస్తున్నారు. ఒకటి వకీల్‌ సాబ్‌గా పింక్ రీమేక్ కాగా.. మలయాళ సినిమా అయ్యప్పన్‌ కోషియమ్‌ రీమేక్‌. ఈ రెండు సినిమాల్లో ఫ్యాన్స్‌ కోసం కొన్ని మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. Also Read: సంక్రాంతికి టీజర్లతో రానున్న పవన్, ప్రభాస్ ! […]

Written By: Srinivas, Updated On : December 28, 2020 5:47 pm
Follow us on


అటు రాజకీయాల్లోనూ.. ఇటు సినిమాల్లోనూ బిజీ అయిపోయారు పవర్‌‌ స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌. రాజకీయంగా పార్టీని నడిపిస్తూనే.. మరోవైపు తన కెరీర్‌‌ను కారణమైన సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా.. పవర్‌‌ స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌ రెండు రీమేక్‌లు చేస్తున్నారు. ఒకటి వకీల్‌ సాబ్‌గా పింక్ రీమేక్ కాగా.. మలయాళ సినిమా అయ్యప్పన్‌ కోషియమ్‌ రీమేక్‌. ఈ రెండు సినిమాల్లో ఫ్యాన్స్‌ కోసం కొన్ని మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: సంక్రాంతికి టీజర్లతో రానున్న పవన్, ప్రభాస్ !

అయితే.. తమిళ, మలయాళ సినిమాల వ్యవహారం వేరు. మన ఫ్యాన్స్ టేస్ట్ వేరు. ఎలాంటి సినిమా అయినా, కథ అయినా పెద్ద హీరోలు చేస్తున్నారు అంటే కచ్చితంగా ఘాటు మసాలా పడాల్సిందే. అందుకే.. పవన్‌ చేస్తున్న పింక్ రీమేక్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నిడివి పెంచుతున్నారట. అంటే.. ఫ్యాన్స్‌కు కావాల్సిన సరుకు అంతా అక్కడ ఉంటుందన్నమాట. ఇదిలా వుంటే అయ్యప్పన్ లో వాస్తవానికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంటూ ఏమీ లేదు.

Also Read: `కేజీఎఫ్ 2’లో బాలయ్య బాబు.. నిజం కాదు !

కానీ.. కథలో కీలకమైన మలుపు, ట్విస్ట్‌ ప్లాన్ చేశారట. దాని కోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను యాడ్‌ బోయబోతున్నారు. అయితే.. ఏదో యాడ్ చేశాం అన్న విధంగా కాకుండా, ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్ గా ఉండేలా ప్లాన్ చేశారు. ఇందుకోసం గ్రాఫిక్స్, సిజి వర్క్ కూడా వాడబోతున్నారు. సినిమా షూట్ ప్రారంభించడమే ఈ ఎపిసోడ్‌తో ప్రారంభిస్తారట. ఆ తరువాత పోలాచ్చి వెళ్లి సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా క్రిష్ డైరక్షన్ లో ఓ సినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్