ఒకే దెబ్బకు రెండు సినిమాలు.. మహేష్ ప్లాన్

కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు సినిమాల షూటింగ్ లన్నీ వాయిదాపడ్డాయి. స్టార్ హీరోలు చేసేదే ఏడాదిన్నరకు ఒక్క సినిమా. కరోనాతో ఇప్పుడు రెండేళ్లుగా సినిమాలు స్టార్ హీరోల సినిమాలు చూసే యోగ్యం ప్రేక్షకులకు లేకుండా పోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన చివరి చిత్రం ‘సర్కారివారి పాట’ను 2020 సంక్రాంతికి విడుదల చేశాడు. ఆ తర్వాత 2021 కరోనాతో పోయింది. ఇప్పుడు మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ‘సర్కారువారి పాట’ పట్టాలెక్కిస్తున్నారు. అంతేకాదు […]

Written By: NARESH, Updated On : June 18, 2021 10:46 am
Follow us on

కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు సినిమాల షూటింగ్ లన్నీ వాయిదాపడ్డాయి. స్టార్ హీరోలు చేసేదే ఏడాదిన్నరకు ఒక్క సినిమా. కరోనాతో ఇప్పుడు రెండేళ్లుగా సినిమాలు స్టార్ హీరోల సినిమాలు చూసే యోగ్యం ప్రేక్షకులకు లేకుండా పోయింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన చివరి చిత్రం ‘సర్కారివారి పాట’ను 2020 సంక్రాంతికి విడుదల చేశాడు. ఆ తర్వాత 2021 కరోనాతో పోయింది. ఇప్పుడు మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ‘సర్కారువారి పాట’ పట్టాలెక్కిస్తున్నారు. అంతేకాదు పోయిన సంవత్సరంను కూడా భర్తీ చేసేందుకు ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లు చేయాలని డిసైడ్ అయ్యారు.

ప్రస్తుతం సర్కారి వారి పాట సినిమాకు ఓ పెద్ద విదేశీ షెడ్యూల్ పెండింగ్ లో ఉందట.. అది ఫారిన్ లో పూర్తి చేశాక వెంటనే త్రివిక్రమ్ సినిమాకు డేట్స్ ఇచ్చారట మహేష్ బాబు. అది ఓ షెడ్యూల్ అయిపోయాక సర్కార్ వారి పాటను పూర్తి చేసి వచ్చే సమ్మర్ లోపు త్రివిక్రమ్ మూవీని కంప్లీట్ చేయాలని మహేష్ బాబు భావిస్తున్నాడట..

ఇలా మహేష్ బాబు ఒకే సమయంలో రెండు సినిమాలు చేయబోతున్నాడట.. ఇప్పటికే ఈ ఫార్ములాను పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్నాడు. 2022 సంక్రాంతికి ‘సర్కారువారిపాట’, 2022 సమ్మర్ కు త్రివిక్రమ్ మూవీ రిలీజ్ చేసేందుకు మహేష్ ప్లాన్ చేసినట్లు తెలిసింది.