గోపీచంద్ మలినేని బాలయ్య సరసన హీరోయిన్ గా త్రిషను ఫైనల్ చేశాడు. ఆమె ఈ సినిమాలో ఒక సాధారణ హౌస్ వైఫ్ పాత్రలో నటించాలి. భార్య పాత్ర కాబట్టి.. కాస్త ఒళ్ళు చేస్తే బాగుంటుంది అని దర్శకుడు త్రిషను కోరాడు. దాంతో, త్రిష ప్రస్తుతం బాగా తిని ఒళ్ళు పెంచే పనిలో నిమగ్నం అయింది. గత కొన్ని రోజులుగా ఫుడ్ విషయంలో ప్రయోగాలు చేస్తూ.. త్రిష లావు పెరగడానికి జంక్ ఫుడ్ ఎక్కువగా తింటుంది అట.
నిజానికి త్రిష చాలా సంవత్సరాలుగా సన్నగా ఉండేలానే మెయింటైన్ చేస్తూ ఉంది. మరి ఇప్పుడు వర్కౌట్స్ కూడా మానేసి, బరువు పెరగడానికి ఫుడ్ విషయంలో ఎలాంటి కండిషన్స్ పెట్టుకోలేదు కాబట్టి.. బాలయ్య పక్కన బబ్లీ త్రిషను చూడొచ్చు. అయినా బాలయ్య సరసన హీరోయిన్ ఎంత లావుగా ఉన్న ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు.
అయితే, త్రిషకు ముందు బాలయ్య సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను అనుకున్నారు. మలినేని గోపీచంద్ ఆమెకు కథ కూడా చెప్పాడు. కానీ బాలయ్య సరసన నటించడానికి శృతి హాసన్ అంగీకరించలేదు. దాంతో గోపీచంద్ మలినేని శృతి హాసన్ కి బదులు త్రిషను తన సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశాడు.
త్రిష కనీసం కథ వినకుండానే బాలయ్య పక్కన నటించడానికి ఒప్పుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు కాబట్టి.. బాలయ్య సినిమానే త్రిష మంచి అవకాశం అనుకోవాలి.