Trisha latest viral post: తమిళ హీరోయిన్ త్రిష సీఎం విజయ్ తో రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే , జనాలకు మేము కలిసే ఉంటున్నాము అనే హింట్స్ వీళ్లిద్దరు కలిసి ఈమధ్యకాలం లో చాలానే ఇచ్చారు. కానీ అధికారికంగా మాత్రం ఎక్కడా ప్రకటించలేదు. ఇద్దరు కలిసి ఉన్నాం అని చెప్పడానికి ఈ మాత్రం హింట్స్ చాలదా?, అధికారికంగా చెప్పాల్సిన అవసరం ఏముంది?, సమయం వచ్చినప్పుడు చెప్పొచ్చు అనే ఉద్దేశ్యం లో ఉన్నారు ఈ జంట. అయితే నేడు కాసేపటి క్రితమే హీరోయిన్ త్రిష ఒక పోస్ట్ వేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. విజయ్ తో రిలేషన్ గురించి త్రిష మరోసారి కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఆమె ఏమి అనిందంటే ‘ఈ ఏడాది మే నెల నా జీవితంలో ఇప్పటికే ఒక మ్యాజికల్ మూమెంట్ ని ఆరంభం లోనే ఇచ్చేసింది, ఇప్పుడు మరో విజయాన్ని అందించింది’ అంటూ చెప్పుకొచ్చింది. మే ఆరంభంలో సరిగ్గా ఆమె పుట్టిన రోజు అయినటువంటి మే 4 న తమిళనాడు లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి, విజయ్ టీవీకే పార్టీ ఈ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇది ఈ నెలలో త్రిష కి దక్కిన మొట్టమొదటి విజయం, అదే విధంగా కొద్దిరోజుల క్రితమే ఆమె హీరోయిన్ గా నటించిన ‘కరుప్పు’ చిత్రం విడుదలైంది. సూర్య హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది . బాక్స్ ఆఫీస్ వద్ద వర్కింగ్ డేస్ , వీకెండ్ డేస్ అని తేడా లేకుండా ఇరగకుమ్మేస్తోంది. లాంగ్ రన్ లో ఇంకా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి. ఇలా ఈ రెండు విజయాలను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ వేసింది.
దీంతో మరోసారి ఆమె విజయ్ నావాడే అని కుండబద్దలు కొట్టినట్టు ఈ పోస్ట్ తో చెప్పకనే చెప్పింది. ఇక ‘కరుప్పు’ విషయానికి వస్తే , ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ వీకెండ్ తో కచ్చితంగా ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరబోతోంది. రాబోయే రోజుల్లో 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరుతుందో లేదో చూడాలి. 14 ఏళ్ళ నుండి సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య , ఈ రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడంటే అందుకు కచ్చితంగా త్రిష గోల్డెన్ లెగ్ కలిసి వచ్చి ఉండొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
View this post on Instagram
