Balakrishna Puri Jagannadh new movie update: దర్శకులలో పూరి జగన్నాథ్(Puri Jagannath) కి ఉన్న క్రేజ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనలో అద్భుతమైన టాలెంట్ ఉంది అని నమ్మే హీరోలు ఇప్పటికీ ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో చలామణి అవుతున్న ఏ హీరో అయినా పూరి జగన్నాథ్ కి అవకాశాలు ఇవ్వడానికి రెడీ ఉంటారు. ఆయన అంటే హీరోలకు అంత ప్రేమ , నమ్మకం. రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ ఒక ఇంటర్వ్యూ లో పూరి జగన్నాథ్ గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో మీరంతా చూసే ఉంటారు. ఆయన లాంటోడిని నేను ఈ ప్రపంచం లోనే చూడలేదు అంటూ వ్యాఖ్యానించాడు . ఎంతో మంది పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో పని చేసిన ప్రభాస్ , ఎవ్వరికీ కూడా ఇలా చెప్పలేదు , అలాంటిది పూరి గురించి చెప్పాడంటే ఆయనతో ఎదురైనా అనుభవాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.
పూరి జగన్నాథ్ అంటే సీనియర్ హీరోలలో కూడా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా బాలయ్య బాబు పూరి కి ఇచ్చే విలువ వేరు , వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో ‘పైసా వసూల్’ అనే చిత్రం వచ్చింది . భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయం లో పూరి జగన్నాథ్ తో బాలయ్య కి ఏర్పడిన సన్నిహిత సంబంధం చాలా ధృడమైనది. అందుకే త్వరలోనే బాలయ్య బాబు మరోసారి బాలయ్య బాబు తో కలిసి సినిమా చేయబోతున్నాడట. ఈసారి పోలీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన లో ఉన్నాడట. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో బాలయ్య కి స్టోరీ రెడీ గా ఉంది . త్వరలోనే ప్రారంభిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు.
మరి పూరి జగన్నాథ్ బాలయ్య కి స్టోరీ వినిపించి , వీళ్ళ కాంబినేషన్ మూవీ ని ఓకే చేశాడా ?, లేదంటే రాబోయే రోజుల్లో స్టోరీ చెప్తాడా అనేది తెలియాలి . ప్రస్తుతం పూరి జగన్నాథ్ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తో ‘స్లమ్ డాగ్’ అనే చిత్రం చేస్తున్నాడు . షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాథ్ కి హిట్ అత్యవసరం. ఈ సినిమా కచ్చితంగా హాట్ అవుతుందనే బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్.