Naveen Polishetty  : ఎదుగుతున్న దశలో యంగ్ హీరోకి కోలుకోలేని దెబ్బ.. నవీన్ సినిమాలకు ఎందుకు దూరమయ్యాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టాడు నవీన్ పోలిశెట్టి. థియేటర్ ఆర్టిస్ట్ అయిన నవీన్ షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమస్ అయ్యాడు. ఆయన నటించిన హాఫ్ డే, ది ట్రూత్ ఆఫ్ ఇంజనీరింగ్ అనే షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మిలియన్స్ కొద్దీ వ్యూస్ రాబట్టాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల నవీన్ పోలిశెట్టిని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు.

Written By: S Reddy, Updated On : July 17, 2024 10:19 pm
Follow us on

Naveen Polishetty  :  హీరో నవీన్ పోలిశెట్టి అమెరికా నుండి ఎందుకు రావడం లేదనే చర్చ ఇటీవల మొదలైంది. కెరీర్లో ఎదుగుతున్న దశలో ఆయన టాలీవుడ్ ని వదిలేసి అక్కడ ఏం చేస్తున్నాడనే సందేహాలు మొదలయ్యాయి. అయితే అందుకు బలమైన కారణం ఉందని తాజాగా తొలిసొచ్చింది. సోషల్ మీడియాలో నవీన్ పోలిశెట్టి ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు.

ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టాడు నవీన్ పోలిశెట్టి. థియేటర్ ఆర్టిస్ట్ అయిన నవీన్ షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమస్ అయ్యాడు. ఆయన నటించిన హాఫ్ డే, ది ట్రూత్ ఆఫ్ ఇంజనీరింగ్ అనే షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మిలియన్స్ కొద్దీ వ్యూస్ రాబట్టాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల నవీన్ పోలిశెట్టిని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. 2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నవీన్ పోలిశెట్టి రిచ్ కిడ్ గా నెగిటివ్ రోల్ చేశాడు.

మహేష్ బాబు-సుకుమార్ కాంబోలో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రంలో సైతం ఆయన ఓ పాత్ర చేశాడు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామాగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తెరకెక్కింది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నవీన్ పోలిశెట్టి కామెడీ ఈ సినిమాకు హైలెట్. క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా అలరిస్తుంది.

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన చిచ్చోరే చిత్రంలో కీలక పాత్ర చేశాడు. హీరోగా నవీన్ పోలిశెట్టి రెండో చిత్రం జాతిరత్నాలు. కొత్త దర్శకుడు కేవీ అనుదీప్ తెరకెక్కించాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామాగా జాతిరత్నాలు చిత్రం తెరకెక్కింది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక రోల్స్ చేశాడు. 2021లో విడుదలైన జాతి రత్నాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన చిత్రం అది.

గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. వరుస హిట్స్ తో జోరుమీదున్న నవీన్ పోలిశెట్టి ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. ఆయన అమెరికాలో ఉంటూ ఇండియాకు రాకపోవడం చర్చకు దారి తీసింది. కెరీర్లో ఎదుగుతున్న దశలో నవీన్ ఇలా సైలెంట్ అయ్యాడేంటి అంటూ ఆడియన్స్ వాపోతున్నారు.

ఈ క్రమంలో నవీన్ పోలిశెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నేను మీతో ఒక వ్యక్తిగత విషయం పంచుకోవాలి. నా కుడి చేతికి, కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో చిత్రీకరణలో పాల్గొనే అవకాశం లేదు. పూర్తిగా కోలుకున్నాక షూటింగ్స్ సెట్స్ లో జాయిన్ అవుతాను. నా కొత్త మూవీ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. అది మీకు నచ్చుతుంది. గ్రేట్ కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను.

త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తాను. మీ ప్రేమాభిమానాలు నాలో స్ఫూర్తి నింపాయి. ధన్యవాదాలు.. అని తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చాడు. ఆ మధ్య అమెరికాలో నవీన్ పోలిశెట్టికి ప్రమాదం జరిగినట్లు కథనాలు వచ్చాయి. స్వల్ప గాయాలతో బయటపడ్డారని అన్నారు. నవీన్ తాజా ప్రకటనతో ఆయన ఒకింత మేజర్ ఆక్సిడెంట్ కి గురయ్యాడని తెలుస్తుంది. నవీన్ సందేశానికి స్పందిస్తూ అభిమానులు త్వరగా కోలుకోవాలని బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.