Bigg Boss 8 Telugu: షాకింగ్ బజ్… బిగ్ బాస్ 8లో మరోసారి ఆ ముగ్గురు? టీఆర్పీ బద్దలే ఇక!

కంటెస్టెంట్స్ ఎంపిక నేపథ్యంలో రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో తాజాగా ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది.

Written By: S Reddy, Updated On : April 17, 2024 3:32 pm

Bigg Boss 8 Telugu

Follow us on

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఊహించని ప్రేక్షకాదరణ పొందింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 అనుకున్న దానికంటే ముందే ప్రారంభం కానుందని సమాచారం. ఈ క్రమంలో బిగ్ బాస్ 8కి సన్నాహాలు మొదలైపోయాయట. ఈ సీజన్ జూన్ లేదా జులై నెలల్లో మొదలవుతుందని తెలుస్తుంది. కంటెస్టెంట్స్ కోసం వేట మొదలుపెట్టారట. పలువురు బుల్లితెర, సినిమా, సోషల్ మీడియా స్టార్స్ ని ఇప్పటికే సంప్రదించినట్లు సమాచారం.

కంటెస్టెంట్స్ ఎంపిక నేపథ్యంలో రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో తాజాగా ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8 లో పాత కంటెస్టెంట్స్ కి అవకాశం ఇవ్వనున్నారట. సీజన్ 7 లో అత్యంత పాపులారిటీ దక్కించుకున్న ఓ ముగ్గురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 8 లో కంటెస్ట్ చేయబోతున్నారని సమాచారం. ఆ ముగ్గురు మరెవరో కాదు గత సీజన్లో టాప్ 3 స్థానాల్లో నిలిచిన పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.

ఎందుకంటే సీజన్ 7 సక్సెస్ లో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించారు అని చెప్పవచ్చు. స్పై బ్యాచ్ వర్సెస్ స్పా బ్యాచ్ మధ్య జరిగిన గొడవలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ని ట్రీట్ చేసిన విధానం అతనికి నెగిటివిటీ తెచ్చిపెట్టింది. అయినప్పటికీ గట్టి పోటీ ఇచ్చాడు. పల్లవి ప్రశాంత్ ఊహించని విధంగా టైటిల్ విన్నర్ అయ్యాడు. అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. విన్నర్ లేక రన్నర్ అవుతాడు అనుకున్న శివాజీ మూడవ స్థానంలో నిలిచాడు.

నిజంగా పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ హౌస్లోకి వస్తే ఆ కిక్ వేరుగా ఉంటుంది. టీఆర్పీ బాక్సులు బద్దలు కావడం ఖాయం. అయితే ఇదంత ఈజీ కాదు. అమర్ దీప్ హీరోగా సినిమా చేస్తున్నాడు. శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. పలు ప్రాజెక్ట్స్ కి సైన్ చేశాడని సమాచారం. ఇక రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ షో కారణంగా జైలుకి వెళ్ళాడు. కాబట్టి ఈ ముగ్గురు బిగ్ బాస్ షోకి రావడం జరగని పని.