Punith rajkumar: కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ ఇటీవలే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ వార్త వినగానే లక్షలాది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు కర్ణాటక సినీ పరిశ్రమతో పాటు టాలీవుడ్ ఇతర సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయనాయకులు పునీత్కు ఘన నివాళి అర్పించారు. ఇక నందమూరి కుటుంబానికి పునీత్ అప్తుడన్న విషయం తెలిసిందే. ఆయన మరణవార్త విన్న బాలకృష్ణ, ఎన్టీఆర్ తీవ్ర మనస్తాపం చెందారు. పునీత్ మరణం సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కాగా, బుధవారం మెగా పవర్స్టార్ రామ్చరణ్ పునీత్ రాజ్కుమార్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉదయం 11 గంటలకు పునీత్రాజ్కుమార్ గృహానికి చేరుకుని నివాళి అర్పించారు. రోజూలాగే శుక్రవారం కూడా పునీత్ రాజ్కుమార్ జిమ్లో వర్క్ఔట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ఛాతి నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఫ్యామిలి డాక్టర్ను సంప్రదించారు. అయితే, వెంటనే ఆసుపత్రిలో చేరమని సలహా ఇచ్చారు డాక్టర్. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హఠాత్తుగా మరణించారు.
మరణించే ముందు రోజు కూడా ఆయన అన్న శివరాజ్కుమార్ హీరోగా నటించిన భజరంగి2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్లారు. ముఖ్య అతిథిగా వచ్చిన యష్తో కలిసి స్టెప్పులు కూడా వేశారు. ఇంతలోనే ఆయన మరణ వార్త యావత్ సినీలోకాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది. 45 స్కూల్స్, 26 ఆర్ఫనేజ్లు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు, 1800 పిల్లలకు ఉచిత చదువుతో పాటు, చనిపోయాక తన రెండు కళ్లను కూడా దానం చేసిన గొప్పవ్యక్తి పునీత్ రాజ్కుమార్.