‘డార్లింగ్’పైనే టాలీవుడ్ నిర్మాతల ఆశలు..!

కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ తో సినిమా షూటింగులన్నీ నిలిచిపోయిన సంగతి తెల్సిందే. కేంద్రం ఇటీవల షూటింగులకు అనుమతి ఇవ్వడంతో మళ్లీ సినిమాల సందడి మొదలైంది. అయితే టాలీవుడ్ దర్శక, నిర్మాతలు మాత్రం షూటింగులను కేవలం లోకల్లోనే తీస్తున్నారు. అవుట్ డోర్ షూటింగులకు చేసేందుకు సాహసించడం లేదు. అయితే వీరిందరు డార్లింగ్ ప్రభాస్ పై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. Also Read: పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ ! ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని చేస్తున్నాడు. […]

Written By: NARESH, Updated On : October 1, 2020 7:50 pm
Follow us on

కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ తో సినిమా షూటింగులన్నీ నిలిచిపోయిన సంగతి తెల్సిందే. కేంద్రం ఇటీవల షూటింగులకు అనుమతి ఇవ్వడంతో మళ్లీ సినిమాల సందడి మొదలైంది. అయితే టాలీవుడ్ దర్శక, నిర్మాతలు మాత్రం షూటింగులను కేవలం లోకల్లోనే తీస్తున్నారు. అవుట్ డోర్ షూటింగులకు చేసేందుకు సాహసించడం లేదు. అయితే వీరిందరు డార్లింగ్ ప్రభాస్ పై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ !

ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగు కరోనా తర్వాత ఇటీవలే ప్రారంభమైంది. ఇటలీలో ఈ మూవీ షూటింగు ప్రస్తుతం జరుగుతోంది. చిత్ర యూనిట్ ముందుగానే అక్కడికి వెళ్లి పద్నాలుగు రోజుల క్వారంటైన్లో ఉన్నారు. అనంతరం షూటింగ్ ప్రారంభించారు. వీరికి షూటింగులో ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా? అని ఇతర నిర్మాతలు ఆరా తీస్తున్నారు.

విదేశాల్లో వీరికి ఎలాంటి సమస్యలు ఎదురుకాకపోతే మిగతావారు కూడా యూరప్ వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగుపై టాలీవుడ్ నిర్మాతలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. అక్కడ ఏవైనా ఇబ్బందులు వస్తే లోకల్ గానే సినిమాలను ప్లాన్ చేయాలని భావిస్తున్నారు. ‘రాధేశ్యామ్’ రిజల్ట్ ఆధారంగానే మిగతా సినిమాల అవుట్ డోర్ షూటింగులు ఆధారపడి ఉన్నాయి. దీంతో వారంతా ప్రభాస్ పైనే ఆశలు పెట్టుకున్నారు.

Also Read: గల్లీబాయ్స్ తో శ్రీముఖి రచ్చ !

ప్రభాస్ హోం బ్యానర్లో ఫ్రెండ్స్ తో కలిసి ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని చేస్తున్నాడు. టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.