Bollywood: దేశంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఇష్టపడే ప్రాంతాలు ఇవీ

సాధారణంగా బాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలు మూవీ షూటింగ్స్ కానీ ప్రమోషన్ ఈవెంట్స్ కానీ సెలవులు కానీ ఉంటే చాలు ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు రెడీ అవుతుంటారు. అయితే ఇక్కడ బాలీవుడ్ సెలబ్రిటీలు ఇండియాలో ఇష్టపడే తరచూ సందర్శించే ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

Written By: Swathi Chilukuri, Updated On : February 22, 2024 1:54 pm
Follow us on

Bollywood: బాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులు తరచుగా సినిమా షూటింగ్ లో కాస్త సమయం దొరికితే చాలు వాళ్లు ఇష్టపడే పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సాధారణంగా బాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలు మూవీ షూటింగ్స్ కానీ ప్రమోషన్ ఈవెంట్స్ కానీ సెలవులు కానీ ఉంటే చాలు ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు రెడీ అవుతుంటారు. అయితే ఇక్కడ బాలీవుడ్ సెలబ్రిటీలు ఇండియాలో ఇష్టపడే తరచూ సందర్శించే ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

IRCTC Goa Package

వీటిలో ముందుగా గోవా.. ఈ ప్రాంతానికి బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు తరచుగా వస్తుంటారు. మూవీ షూటింగ్స్ తో పాటు పార్టీలకు అనువైన ప్రదేశమని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, రాజ్ కుమార్ రావు వంటి ప్రముఖులు గోవాకు రావడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

రాజస్థాన్ లోని జైపూర్.. జైపూర్ తన ప్రకృతి అందాలతో పర్యాకులను బాగా ఆకర్షిస్తుంది. కత్రినా కైఫ్, తాప్సీ పన్ను వంటి హీరోయిన్లు వెకేషన్స్ లో జైపూర్ కు వస్తుంటారు. అలాగే రాజస్థాన్ లోనే మరో ప్రాంతం ఉదయ్ పూర్.. ఇక్కడికి ఎక్కువగా వివాహ వేడుకలను నిర్వహించేందుకు సెలబ్రిటీలు ఆసక్తి కనబరుస్తారు.

తరువాత కశ్మీర్.. అక్కడ ఉండే పచ్చికభూములు, హిమాలయ పర్వతాలు, లోయలు పర్యాటకులతో పాటు మూవీ మేకర్స్ మరియు సెలబ్రిటీలను బాగా ఆకట్టుకుంటాయి. తరువాత మహారాష్ట్రలోని అలీబాగ్.. ఇక్కడ అందమైన బీచ్ లు, రెస్టారెంట్లు ఉన్నాయి..అయితే ఈ ప్రాంతానికి తరచుగా అనన్యా పాండే, సుహానా ఖాన్, విరాట్ కోహ్లీ మరియు గౌరీ ఖాన్ వంటి ప్రముఖులు వస్తుంటారు.

తరువాత కేరళ.. కేరళ అందాలను ఎంత చూసిన తక్కువేనని చెప్పుకోవచ్చు. అక్కడ ఉండే పచ్చదనం, నదులు, లేక్స్ ఎంతోగానో మనసును ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతానికి కూడా సోనాక్షి సిన్హా వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు.