MLA Anitha Radhakrishnan: ప్రజా ప్రతినిధులు బాధ్యతగా ఉండాలి. మాట్లాడే ప్రతి మాట హుందాగా ఉండాలి. అన్నిటికి మించి ప్రజల సమక్షంలో మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే.. కనీసం స్పృహ కూడా లేకుండా వ్యవహరిస్తే.. ఆ తర్వాత మర్యాద ఉండదు. ఇప్పుడు ఇదే పరిస్థితిని తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నారు.
ఆయన పేరు అనితా రాధాకృష్ణన్.. తమిళనాడులో డీఎంకేకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే. ఆయనను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారని విషయం ఆయనకు ముందుగానే తెలుసు. అందువల్లే మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఆ వాజ్యాన్ని మద్రాస్ హైకోర్టు తీసి పక్కనపెట్టింది. దీంతో తమిళనాడు పోలీసులకు లైన్ క్లియర్ అయింది. ఫలితంగా ఆయనను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. దర్జాగా శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకెళ్లారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు.
రాధాకృష్ణన్ కు నోటి దూల ఎక్కువ. అందువల్లే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కనీసం ఆడవాళ్ళకు గౌరవం కూడా ఇవ్వరు. తను ఏం మాట్లాడుతున్నాడు సోయి కూడా ఉండదు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, త్రిష ఉద్దేశించి ఓ సభలో దారుణంగా మాట్లాడారు. “విజయ్ రాజకీయాల్లో ఇరుక్కుపోయారు. ఆ విషయంలో ఆయన బాధపడుతూనే ఉంటారు. ఇంట్లో నటి (త్రిష) తో ఎంతో సంతోషంగా ఉండి ఉంటారు. ఇప్పుడు దానిని ఆయన నిత్యం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఎందుకు వచ్చిన రాజకీయాలు అని ఆయన నిత్యం అనుకుంటూనే ఉంటారని” రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలను టీవీకే నేతలు తీవ్రంగా స్పందించారు. రాజకీయాలలో వ్యక్తిగత అంశాలను ఎందుకు తీసుకొస్తారని.. వ్యక్తిగత అంశాలను ఎందుకు ప్రస్తావిస్తారని టీవీకే నేతలు ప్రశ్నించారు. మరోవైపు దీనిపై టీవీకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేశారు. ఇప్పుడు తమిళనాడు పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. నోరు హద్దులలో ఉంటే బాగుంటుంది. అదుపు తప్పితే ఇదిగో ఇలానే జైలు పాలు కావాల్సి వస్తుంది.

