Photo Story: వీరిలో ఒకరు ఏపీ సీఎం, మరొకరు సినీ స్టార్.. వాళ్లెవరో గుర్తుపట్టండి..

అక్కినేని ఫ్యామిలీ నుంచి వారు స్టార్లుగా మారారు. వీరిలో సుమంత్ ఒకరు. ‘ప్రేమకథ’ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన ఆ తరువాత పలు సినిమాల్లో నటించారు. అయితే మిగతా హీరోల్లాగా స్టార్ గుర్తింపు తెచ్చుకోలేకపోయారు.

Written By: Srinivas, Updated On : March 16, 2024 5:32 pm

Photo Story

Follow us on

Photo Story: ఒక్క ఫొటో జీవితం గురించి చెబుతుందంటారు. అందుకే కొంత మంది అపురూపమైన చిత్రాలను చాలా రోజుల వరకు దాచుకుంటారు. వీటిని ప్రత్యేక సందర్భాల్లో బయటకు తీసినప్పుడు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. ఇలాంటి వాటిలో సినీ, రాజీకయ సెలబ్రెటీలదైతే ఇంకా ఇంప్రస్ గా ఉంటుంది. సోషల్ మీడియా వచ్చాక చాలా మంది సినీ సెలబ్రెటీలు తమ చిన్న నాటి ఫొటోలను బయటకు తీస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఓ ఫొటో వైరల్ గా మారింది. అయితే ఇందులో ఓ సినీ హీరోతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఉన్నారు. ఇంతకీ వాళ్లెవరో తెలుసా?

అక్కినేని ఫ్యామిలీ నుంచి వారు స్టార్లుగా మారారు. వీరిలో సుమంత్ ఒకరు. ‘ప్రేమకథ’ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన ఆ తరువాత పలు సినిమాల్లో నటించారు. అయితే మిగతా హీరోల్లాగా స్టార్ గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. కానీ సుమంత్ కు ప్రత్యేక గుర్తింపు అయితే ఉంది. ఇప్పటికీ కొన్ని సినిమాల్లో సుమంత్ హీరోగా వచ్చాడు. ఆయన నటించిన ‘ఇదం జగత్’ అనే సినిమా ఫంక్షన్ కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుమంత్ ఏం చెప్పాడంటే?

వైఎస్ జగన్, తాను ఒకే స్కూల్ లో చదువుకున్నామని, మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అని సుమంత్ చెప్పారు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఒకే స్కూల్ లో చదివిన ఇద్దరు రెండు రంగాల్లో స్టార్లుగా ఎదగడం.. ఆ విషయం ఇప్పటికీ బయటకు రాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో సుమంత్, జగన్ స్నేహితుల్లో మరికొంత మంది వారి పాత ఫొటోలను బయటపెట్టారు. ఇందులో సుమంత్, జగన్ కలిసి ఉన్న ఫొటో ఆసక్తిగా మారింది.

ఇందులో సుమంత్, జగన్ మాత్రమే కాకుండా పల్లవి, ఐఎస్ విష్ణు, రామారావు, వర ప్రసాద్ లు ఉన్నారు. వీళ్లంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివారు స్కూల్ డ్రెస్ లో ఉన్నప్పుడు తీసుకున్న ఫొటో ఇది. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది లైక్ లు కొడుతున్నారు. కొంత మంది కామెంట్లు పెడుతున్నారు.