Dil Raju: నేచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో, ట్రేడ్ లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. ఒక పాన్ ఇండియన్ స్టార్ హీరో సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో , ఈ చిత్రానికి ఆ రేంజ్ క్రేజ్ ఉంది. ఈ ఏడాది మార్చి 26 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా , షూటింగ్ చాలా వరకు పెండింగ్ ఉండడంతో జూన్ కి , ఆ తర్వాత ఆగష్టు 21 కి వాయిదా పడింది. అప్పటికీ కూడా ఈ సినిమా రెడీ కాకపోవడంతో , ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 24 న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బయ్యర్స్ కి సమాచారం కూడా అందించారట. త్వరలోనే విడుదల తేదిని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాన్ని భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ గా ఒక వార్త , సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అదేమిటంటే, ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ మొత్తాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు 110 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని , ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఆయనే గ్రాండ్ గా మార్కెటింగ్ చేసి విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. దీనిపై మూవీ టీం స్పందించింది. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ,దయచేసి ఇలాంటివి నమ్మొద్దు అంటూ మూవీ టీం అధికారిక ప్రకటన చేసింది. సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ అయినా అధికారికంగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటిస్తామని పేర్కొంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన నైజాం రైట్స్ కోసం దిల్ రాజు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వాస్తవం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో సాగుతున్న చర్చ.
దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించిన నైజాం ప్రాంత థియేట్రికల్ రైట్స్ ని 30 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. కానీ నిర్మాత 36 కోట్ల రూపాయిలు విత్ నాన్ రిఫండబుల్ అమౌంట్ బేసిస్ మీద మాత్రమే అమ్ముతానని చెప్పారట. ప్రస్తుతం వీళ్ళ మధ్య చర్చలు నడుస్తోంది. 30 నుండి 36 కోట్ల మధ్య లో ఎదో ఒక రేటుకి ఈ సినిమా అమ్ముడుపోయే అవకాశం ఉంది. గతంలో నాని ‘దసరా’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను నైజాం ప్రాంతం లో రాబట్టింది. ‘ప్యారడైజ్’ కి దసరా కి మించి భారీ క్రేజ్ ఉండడం తో , దిల్ రాజు కూడా డీల్ లాక్ చేసే ఆలోచనలో ఉన్నారట, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
