Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాతగా ఈటీవీ లో అతిపెద్ద రియాలిటీ షో..కానీ చివరి నిమిషంలో ఏమైందంటే!

దాదాపుగా మూడు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ టాక్ షోని, తెలుగు లో పవన్ కళ్యాణ్ ని వ్యాఖ్యాతగా పెట్టి చేయాలనుకున్నాడు రామోజీ రావు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ అనూహ్యంగా ఆయన రాజకీయాలు, సినిమాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం ప్రారంభించడంతో ఫుల్ బిజీ అయిపోయాడు.

Written By: Vicky, Updated On : August 26, 2024 3:01 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక రియాలిటీ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి ఒప్పుకున్నాడు అనే విషయం ఎవరికైనా తెలుసా..?, ఆ రియాలిటీ షోని ఈటీవీ లో టెలికాస్ట్ చెయ్యాలని అనుకున్నారనే విషయం మీకు తెలుసా..?, కానీ చివరి నిమిషంలో కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల అది కార్యరూపం దాల్చలేక పోయింది. సినిమాలు చేసేందుకే సమయం లేని పవన్ కళ్యాణ్ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఏమిటి?, ఫేక్ ప్రచారం చేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు. కానీ అది ముమ్మాటికీ నిజం. బిగ్ బాస్ లాంటి ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షోస్ కి అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాతగా ఎన్ని కోట్లు ఇస్తామన్నా చెయ్యడు. కానీ జనాలకు ఉపయోగపడే రియాలిటీ షోస్ చెయ్యడానికి మాత్రం నిమిషం ఆలోచించకుండా ముందుకొస్తాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అప్పట్లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’ అనే షో ని నిర్వహించాడు. సామజిక స్పృహ నిండుగా ఉండే అమీర్ ఖాన్ ఇలాంటి కార్యక్రమాలు చెయ్యడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. దూరదర్శన్ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ టాక్ షో అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది.

దాదాపుగా మూడు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ టాక్ షోని, తెలుగు లో పవన్ కళ్యాణ్ ని వ్యాఖ్యాతగా పెట్టి చేయాలనుకున్నాడు రామోజీ రావు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ అనూహ్యంగా ఆయన రాజకీయాలు, సినిమాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం ప్రారంభించడంతో ఫుల్ బిజీ అయిపోయాడు. దీంతో రామోజీ రావు కూడా ఈ ప్రోగ్రాం చెయ్యాలనే ఆలోచన విరమించుకున్నాడు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం చేస్తే పవన్ కల్యాణే చెయ్యాలి అనేది ఆయన అభిలాష. ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్ ఏమిటంటే సమస్యలతో వచ్చే ప్రజలకు ఈ షో ద్వారా తీర్పుని ఇచ్చి, వాళ్ళ సమస్యలను పరిష్కరించడమే. ఈ కాన్సెప్ట్ తో జీ తెలుగులో రోజా వ్యాఖ్యాతగా ‘బ్రతుకు జట్కా బండి’ అనే ప్రోగ్రాం వచ్చింది.

ఇదే తరహా కాన్సెప్ట్ తో జెమినీ లో మంచు లక్ష్మీ ‘మేము సైతం’ అనే ప్రోగ్రాం చేసింది. వీళ్లంతా చెయ్యడం వేరు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఇలాంటి షో చెయ్యడం వేరు. అయితే అప్పట్లో ఆయన షో ద్వారా చేయాలనుకున్నది, నేడు ఉపముఖ్యమంత్రి హోదాలో చేస్తున్నాడు, అశేష ప్రజాభిమానంని పొందుతూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుండి సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీ కాబోతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హర వీరమల్లు’ వంటి సినిమాలు ఉన్నాయి. సగానికి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాలకు, పవన్ కళ్యాణ్ కేవలం కొన్ని రోజుల డేట్స్ ఇస్తే షూటింగ్స్ మొత్తం పూర్తి అవుతాయి. సెప్టెంబర్ చివరి వారం నుండి ఆయన ‘ఓజీ’ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.