Akkineni Nagarjuna : శోభిత దెబ్బకి తలకిందులైన అక్కినేని ఫ్యామిలీ.. పెళ్ళికి ముందే ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్!

ఇదంతా పక్కన పెడితే ఈ సంఘటనకు ఏమాత్రం సంబంధం లేని శోభితపై సోషల్ మీడియా లో పోస్టులు పడుతున్నాయి. ఆమెతో నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్న తర్వాత ఈ సంఘటన జరగడంతో కొంతమంది అక్కినేని అభిమానులు కూడా ఆమెపై ట్రోల్స్ వేస్తున్నారు.

Written By: Vicky, Updated On : August 24, 2024 8:26 pm

Sobhita And Naga Chaitanya

Follow us on

Akkineni Nagarjuna  : సమంత అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన దగ్గర నుండి అక్కినేని ఫ్యామిలీ కి దురదృష్టం పట్టిందా అంటే అవుననే అనాలి. ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని కుటుంబం నుండి విడుదలైన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. అడపాదడపా ఒకటి రెండు హిట్లు వచ్చాయి కానీ, అవి అభిమానులను నూటికి నూరు శాతం సంతృప్తి పర్చలేదు. మరోపక్క సమంత కి విడాకులు తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చిందని, ఆమె రేంజ్ ఇప్పుడు అక్కినేని హీరోలందరికంటే ఎక్కువని, సమంత అభిమానులు సోషల్ మీడియా లో చెప్పుకొస్తున్నారు. ఇకపోతే నేడు అక్కినేని నాగార్జున కలలో కూడా ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

అక్రమంగా చెరువుని ఆక్రమించి మాధాపూర్ లో నాగార్జున కట్టుకున్న N కన్వేషన్ హాల్ ని నేడు తెలంగాణ ప్రభుత్వం కూల్చేసింది. గడిచిన పదేళ్లలో నాగార్జున బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలతో లావాదేవీలు చేసి, ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేతకు గురి కాకుండా మ్యానేజ్ చేస్తూ వచ్చాడు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం నోటీసు కూడా ఇవ్వకుండా నేడు హైడ్రా ద్వారా న కన్వేషన్ హాల్ ని నేలమట్టం చేయించింది. ఇది నాగార్జున కి అతి పెద్ద షాక్. ఇదంతా శోభిత అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టిన వేళావిశేషం అని సమంత అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఒక ఆడపిల్లకు అన్యాయం చేస్తే ఇలాంటి పరిణామాలే చూడాల్సి వస్తుందని, ఇది కేవలం టీజర్ మాత్రమేనని, శోభిత తో పెళ్లి జరిగిన తర్వాత అసలు సిసలు సినిమా ఉంటుందని, ముందుంది ముసళ్ల పండగ అంటూ సమంత అభిమానులు సోషల్ మీడియాలో నాగార్జున ని ట్యాగ్ చేస్తూ పోస్టులు వేస్తున్నారు. నేడు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ చూసినా నాగార్జున గురించే చర్చ. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాం లోనే ఈ కట్టడాన్ని ప్రారంభించాడు నాగార్జున. అప్పుడు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మాత్రం ఎందుకు పట్టించుకుందని?, ప్రభుత్వం నాగార్జునను ఎదో కోరిక కోరిందని, దానికి నాగార్జున ఒప్పుకోకపోవడం వల్లే కక్ష పూరితంగా ఇలా కూల్చివేతలు పాల్పడ్డారు అంటూ అక్కినేని అభిమానులు సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఈ సంఘటనకు ఏమాత్రం సంబంధం లేని శోభితపై సోషల్ మీడియా లో పోస్టులు పడుతున్నాయి. ఆమెతో నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్న తర్వాత ఈ సంఘటన జరగడంతో కొంతమంది అక్కినేని అభిమానులు కూడా ఆమెపై ట్రోల్స్ వేస్తున్నారు. ఎదో ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని శోభితని ఐరన్ లెగ్ అనడం భావ్యం కాదు, ఏదైనా శుభం జరిగితే ఆమెని ఇలాగే లింక్ చేస్తారా?, లేదు కదా?, మరి అశుభం జరిగినప్పుడు మాత్రం ఎందుకు ఇలా చేస్తారు అంటూ విశ్లేషకులు అభిమానులను ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా నాగ చైతన్య – శోభిత ఈ ఏడాది డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.