Homeఎంటర్టైన్మెంట్Ram charan: చరణ్ అందుకే ముందుగానే 'మాల' వేసుకుంది !

Ram charan: చరణ్ అందుకే ముందుగానే ‘మాల’ వేసుకుంది !

Ram charan
Mega Power Star Ram Charan In Swamy Mala

Ram charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘అయ్యప్ప స్వామి’కి గొప్ప భక్తుడు. చిన్నతనం నుంచే చరణ్ ‘అయ్యప్ప స్వామికి ప్రత్యేకంగా పూజ చేస్తారు. నిజానికి ఈ తరం స్టార్ హీరోల్లో అత్యంత భక్తుల్లో మొదటివాడు చరణే. అందుకే ప్రతి ఏడాది చరణ్ దీక్షని పాటిస్తాడు. అయితే ఏటా నవంబర్, డిసెంబర్ లలో అయ్యప్ప మాల వేసుకునే చరణ్ ఈ సారి మాత్రం ముందే మాల వేసుకున్నాడు.

చరణ్(Ram charan) మాల వేసుకున్న తర్వాత 40 రోజులు దీక్ష పాటిస్తారు. అందుకే డిసెంబర్ లో దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండటానికి చరణ్ ముందుగానే మాల వేసుకున్నాడట. ఇక సౌత్ ఫిల్మ్ డైరెక్టర్స్ లోనే ప్రస్తుత ధ్రువతారగా వెలిగిపోతున్న దర్శకుల్లో ‘శంకర్’ కూడా ఒకరు.

అలాంటి దర్శకుడు ‘రామ్ చరణ్ తో సినిమా చేస్తోన్నాడు అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అన్నట్టు ఈ భారీ బడ్జెట్ సినిమాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం అక్షయ్ కుమార్ ను తీసుకోవాల ని ప్లాన్ చేస్తున్నారు శంకర్.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, రామ్ చరణ్ వరుసగా మూడు సినిమాలు ప్రకటించారు. శంకర్ దర్శకత్వంలో సినిమా పూర్తి కాగానే, ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తాడు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version