spot_img
Homeఎంటర్టైన్మెంట్Gayathri Gupta: దానికి ఒప్పుకుంటే ఫ్లాట్, కారు, 10 లక్షలు.. క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు...

Gayathri Gupta: దానికి ఒప్పుకుంటే ఫ్లాట్, కారు, 10 లక్షలు.. క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు హీరోయిన్ కీలక ఆరోపణలు

Gayathri Gupta: మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై అధ్యయనం చేసేందుకు, అక్కడి ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ కాలం పలువురు నటులను సంప్రదించిన హేమ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మాలీవుడ్ లో మహిళలకు రక్షణ లేదు. లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ తీవ్ర స్థాయిలో ఉంది.

అవకాశాలు పోతాయని, కెరీర్ ఉండదని భయపడుతున్న నటీమణులు తమపై జరిగిన లైంగిక దాడులను బయటపెట్టడం లేదు. అవకాశాల విషయంలో మహిళలకు అన్యాయం జరుగుతుందని హేమ కమిటీ షాకింగ్ ఫ్యాక్ట్స్ వెలుగులో తెచ్చింది. హేమ కమిటీ నివేదిక అనంతరం కొందరు నటీమణులు బయటకు వచ్చారు. తమను లైంగికంగా వేధించిన ప్రముఖుల పేర్లు వెల్లడించారు.

తాజాగా టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తన అసిస్టెంట్ పై అతడు చాలా కాలంగా లైంగిక దాడులకు పాల్పడినట్లు సమాచారం. అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు, అలాగే తన నివాసంలో పలుమార్లు జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఫిల్మ్ ఛాంబర్ సైతం 90 రోజుల్లో జానీ మాస్టర్ ఉదంతం పై విచారణ చేపట్టి, ఒక నిర్ణయానికి వస్తామని వెల్లడించడమైంది. క్యాస్టింగ్ కౌచ్ పై మొదటి నుండి పోరాటం చేస్తున్న తెలుగు అమ్మాయిల్లో గాయత్రి గుప్తా ఒకరు. గతంలో ఆమె పలు ఇంటర్వ్యూలలో టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ఆఫర్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అని వాపోయారు.

తాజాగా ఆమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని తెలియజేసింది. నాకు ఓ బాలీవుడ్ మూవీలో ఆఫర్ రాగా.. వాళ్ళను కలిసేందుకు వెళ్ళాను. 12 రోజులు మాతో గడిపితే ఒక ఫ్లాట్, కారు, రూ. 10 లక్షలు నీకు ఇస్తామని అన్నారు. నేను అక్కడి నుండి వచ్చేశాను, అని గాయత్రీ గుప్తా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.

పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ పై నేరుగా ఆరోపణలు చేయడం కూడా సంచలనం రేపుతోంది. గతంలో త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేస్తే స్వీకరించలేదని ఆమె అన్నారు. పైగా తనకు వేధింపులు ఎదురయ్యాయని అన్నారు. అప్పట్లో మా స్పందించి ఉంటే ఇప్పుడు జానీ మాస్టర్ లాంటి వాళ్ళు తప్పు చేసేవాళ్ళు కాదని, ఆమె వాపోయింది. పూనమ్ ఇప్పుడు ఫిర్యాదు చేసినా విచారణ చేపడతామని తమన్నా రెడ్డి భరద్వాజ్ చెప్పడం విశేషం.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper