Tamannaah Bhatia: సౌత్ ఇండియా లో అగ్ర తారగా ఒక వెలుగు వెలిగిన తమన్నా, ఇప్పుడు మన సౌత్ లో కంటే ఎక్కువగా నార్త్ ఇండియా లోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో వరుసగా ఆమె ప్రతిష్టాత్మక చిత్రాల్లో భాగం అవుతూ వచ్చింది. ముఖ్యంగా ఆమె ఐటెం సాంగ్స్ ఎక్కువగా చేస్తూ వస్తోంది. ఎన్నో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో కనిపించాల్సిన ఆమె , ఇలా ఐటెం సాంగ్స్ కి మాత్రమే పరిమితం కావడం అభిమానులకు అసలు నచ్చడం లేదు. తమన్నా రేంజ్ కి తగ్గ సినిమాలు చేయడం లేదని ఆమె అభిమానులు బాధ పడుతున్నారు. అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో , తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిన ‘బాహుబలి’ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘నేటి పరిస్థితులను బట్టీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాహుబలి కోసం తీసుకున్న ప్రతీ నిర్ణయం అద్భుతమైనది గా అనిపిస్తోంది. కానీ ఆ సినిమా తీస్తున్న సమయంలో ట్రేడ్ లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. కేవలం ఒక ప్రాంతీయ భాషకు సంబంధించిన సినిమా కోసం ఆరోజుల్లోనే 200 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయడం సాధారణమైన విషయం కాదు. వ్యాపార పరంగా చూస్తే , అప్పటి పరిస్థితులను బట్టీ , ఫ్లాప్ కి దారి తీసే అత్యంత ప్రమాదకరమైన మార్గం లాగా అనిపించింది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఆరోజుల్లో రాజమౌళి తన విజన్ కి తగ్గట్టు , ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు కాబట్టే , అంతటి అద్భుతమైన విజయాన్ని సాధించింది , లేదంటే చాలా పెద్ద సమస్యలు ఎదురయ్యేవి అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.
ప్రస్తుతం ఈమె ద్రుష్టి మొత్తం బాలీవుడ్ మీదనే ఉంది. గత ఏడాది ఈమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓదెల 2’ విడుదలై పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అదే తెలుగు లో ఈమె చివరిగా కనిపించిన చిత్రం. ఆ సినిమా తర్వాత తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. అక్కడ అడల్ట్ కంటెంట్ సినిమాలు చేయడానికి కూడా సిద్ధమైంది. ఇక ఈఏడాది ఆమె చేతిలో ‘ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’, ‘పురుషన్ ‘, ‘వీ శాంతారాం’, ‘రాకేష్ మరియా బయోపిక్’ , ‘రాగిణి 3’, ‘భోలే చుడియన్ ‘ వంటి హిందీ చిత్రాలు చేస్తోంది. వీటిల్లో కొన్ని చిత్రీకరణ దశలో ఉండగా , మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
