Supritha: మాల్దీవుల బీచ్ లో రాత్రి నులక ఉయ్యాలపై సుప్రీత ఆ పని.. వైరల్ పిక్స్

నటి సురేఖా వాణి తెలుగులో పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. కెరీర్ బిగినింగ్ లో ఆమె యాంకర్ గా చేశారు. ఆ సమయంలో సురేష్ తేజ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది.

Written By: NARESH, Updated On : December 27, 2023 6:59 pm

Supritha

Follow us on

Supritha: సురేఖ వాణి కూతురు సుప్రీత వెకేషన్ మూడ్ లో ఉంది. ఆమె మాల్దీవ్స్ వెళ్లినట్లున్నారు. సాగర తీరంలో ఎంజాయ్ చేస్తున్న సుప్రీత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సుప్రీతకు మంచి పాపులారిటీ ఉంది. కేవలం సోషల్ మీడియా ద్వారా ఫేమ్ రాబట్టింది. సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచుగా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఆన్లైన్ చాట్ లో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంది. హీరోయిన్ కావాలనేది ఆమె కల.

నటి సురేఖా వాణి తెలుగులో పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. కెరీర్ బిగినింగ్ లో ఆమె యాంకర్ గా చేశారు. ఆ సమయంలో సురేష్ తేజ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. సురేష్ తేజ అనారోగ్యంతో 2019లో మరణించాడు. భర్త మరణంతో కొన్నాళ్ళు నటనకు దూరం అయ్యింది. ఆమె కోలుకునే లోపు కోవిడ్ మొదలైంది.గ్యాప్ రావడంతో పరిశ్రమ ఆమెను మర్చిపోయింది.

ఆ మధ్య దర్శక నిర్మాతలు నన్ను పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే కూతురు సుప్రీతను హీరోయిన్ గా నిలబెట్టాలనేది ఆమె కోరిక. సురేఖా వాణి-సుప్రీత జస్ట్ లైక్ ఫ్రెండ్స్ వలె ఉంటారు. సందర్భం ఏదైనా కలిసి జరుపుకుంటారు. కలిసి వెకేషన్స్ కి వెళతారు. బర్త్ డే పార్టీలో కూతురుకి సురేఖా వాణి స్వయంగా మద్యం తాగించడం చర్చకు దారి తీసింది.

సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ ని సుప్రీత తీవ్ర స్థాయిలో ఖండించింది. మీ ప్రయోజనాల కోసం నిరాధార కథనాలు రాయవద్దని వార్నింగ్ ఇచ్చింది. సుప్రీత మీద అప్పుడే ఎఫైర్ రూమర్స్ ఉన్నాయి. ఇక హీరోయిన్ కావాలని ఆమె ప్రయత్నాలు చేస్తుంది. చూడాలి ఏ మేరకు సక్సెస్ అవుతుందో.

సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ గుండెల్లో గుబులు రేపుతోంది. తాజాగా రాత్రివేళ సాగర తీరంలో వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు పంచుకుంది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.