గంగవ్వ.. ఓ మారుమూల గ్రామానికి చెందిన అవ్వ. ఇంతింతై వటుడింతై అన్న చందంగా.. ఊహించని స్థాయికి ఎదిగింది. మై విలేజ్ షోతో యూ ట్యూబ్ స్టార్ అయింది. దీంతో బిగ్బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్గా అవకాశమూ వచ్చింది.
ముందు నుంచీ బిగ్బాస్ షోలో గంగవ్వ ప్రేక్షకులకు దగ్గరైంది. తనదైన స్టైల్లోనే ఆడుతూ.. మిగితా కంటెస్టెంట్లతో మాట్లాడుతూ తన ప్రయాణం సాగించింది. ముందు నుంచి కూడా గంగవ్వ మీద పెద్దగా నెగెటివ్ కామెంట్స్ కూడా రాలేదు. కనీసం ఎలిమినేషన్స్ లో కూడా డేంజర్ జోన్లోకి ఏ ఎపిసోడ్లోనూ పోలేదు. నామినేషన్ ప్రక్రియలో ఆడియెన్స్ ఆమెను ఏ మాత్రం ఒప్పుకోనూ లేదు. ఇక తన సొంత నిర్ణయం తరువాత 35 రోజులకు బయటకు వచ్చింది. ఇక ఆమె రెమ్యునరేషన్ పై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చారు.
బిగ్ బాస్ సీజన్ 4 నుంచి బయటకు వచ్చి గంగవ్వ తన సొంత గ్రామమైన లాంబాడిపల్లెకు చేరుకుంది. తరువాత ఆమెను కలవడానికి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే.. ఇటీవల యాంకర్స్ జోర్దార్ సుజాత, బిత్తిరి సత్తి వారి ప్రొఫెషనల్ స్టైల్లో ఇంటర్వ్యూలు చేశారు. మరికొందరు పర్సనల్ గా కలుసుకున్నారు. హౌజ్లో గడిపిన క్షణాలను గురించి షేర్ చేసుకున్న గంగవ్వ తన పర్సనల్ లైఫ్ విషయాలను గురించి కూడా క్లారిటీ ఇచ్చింది.
35 రోజులపాటు హౌజ్లో ఉన్న గంగవ్వకు బిగ్బాస్ షో ద్వారా అసలు అందిన రెమ్యునరేషన్ ఎంత..? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్లా నడుస్తోంది. రూ.10 లక్షల వరకు ఆమెకు పారితోషికం ఇచ్చారని అలాగే బిగ్బాస్ హోస్ట్ నాగార్జున మరో 5 లక్షల వరకు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ అబద్ధాలని ఒక్క మాటతో గంగవ్వ కొట్టిపారేసింది. ఇప్పటి వరకు బిగ్బాస్ నుంచి తనకు ఒక్క రూపాయి కూడా రాలేదని స్పష్టత ఇచ్చింది. ‘వాళ్ళు కచ్చితంగా ఇస్తానని చెప్పారు. అలాగే ఇల్లు లేదా మరొక విధంగా సహాయం చేస్తారని అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఇల్లు కట్టిస్తాను అన్నా కూడా నేను ఒప్పుకోను. నా ఊళ్ళోనే ఇల్లు కట్టిస్తాను అంటేనే ఒప్పుకుంటాను. కోటి రూపాయలు ఇల్లు కట్టిచ్చినా కూడా హైదరాబాద్ లో అయితే ఉండలేను’ అని వివరణ ఇచ్చింది.
గంగవ్వ క్లారిటీ ఇవ్వడంతో ఇక తన రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వార్తల మీద కూడా క్లారిటీ వచ్చినట్లైంది. అయితే.. నాగార్జున ఇచ్చిన హామీ కూడా ఎప్పుడు నెరవేరుతుందా అని అందరూ ఆసక్తిగానే చూస్తున్నారు.