Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 లోకి మగజాతి ఆణిముత్యం..రాజ్ తరుణ్ – లావణ్య వివాదంలో కూడా ఇతను కీలక వ్యక్తి !

తేజస్విని గౌడా బదులుగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ పేరు ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. అతను మరెవరో కాదు శేఖర్ భాషా. మగజాతి ఆణిముత్యంగా ఇతని పేరు మీరు ఈమధ్య కాలంలో బాగా వైన్ ఉంటారు. రాజ్ తరుణ్ , లావణ్య వివాదంలో ఈయన రాజ్ తరుణ్ పక్షాన నిలబడి, లావణ్యపై పోరాటం చేసాడు.

Written By: Vicky, Updated On : August 26, 2024 8:58 pm

Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8 : కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 వ తేదీ నుండి స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ షో గురించి సోషల్ మీడియా లో ప్రతీ రోజు చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో రోజుకో ట్విస్ట్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించని కంటెస్టెంట్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ముందు నుండి మనకి వినిపిస్తున్న కంటెస్టెంట్స్ పేర్లు లిస్ట్ నుండి తప్పుకుంటున్నాయి. అలా లిస్ట్ నుండి తప్పుకున్న పేరు తేజస్విని గౌడా. ఈమె గత సీజన్ రన్నర్ అమర్ దీప్ కి భార్య. సోషల్ మీడియా లో మొదటి నుండి బాగా పాపులర్.

ఈమె యూట్యూబ్ ఛానల్ కి రెండు మిల్లియన్లకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. అయితే మొదట్లో ఈమె ఈ సీజన్ లోకి వస్తుందని బాగా ప్రచారం అయ్యింది, అందుకు కారణం బిగ్ బాస్ టీం ఈమెని సంప్రదించడం వల్లే, కానీ ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం సిద్ధంగా లేకపోవడంతో ఈ షో నుండి తప్పుకుంది. ఇప్పుడు ఆమెకి బదులుగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ పేరు ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. అతను మరెవరో కాదు శేఖర్ భాషా. మగజాతి ఆణిముత్యంగా ఇతని పేరు మీరు ఈమధ్య కాలంలో బాగా వైన్ ఉంటారు. రాజ్ తరుణ్ , లావణ్య వివాదంలో ఈయన రాజ్ తరుణ్ పక్షాన నిలబడి, లావణ్యపై పోరాటం చేసాడు. ఆమె ఆడుతున్న ఆటలను అరికట్టేందుకు ఈయన చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రేడియో లో జాకీ గా పనిచేసే శేఖర్ భాషా, మగవాళ్లకు ఆడావాళ్ల వల్ల జరుగుతున్న మోసాలపై తన గళం విప్పుతూ యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఈయనని బిగ్ బాస్ టీం ఇటీవలే ఇంటర్వ్యూ చేసి షోలోకి ఎంచుకుంది. ఇతనితో పాటు యాంకర్ విష్ణు ప్రియా, నైనికా (ఢీ డ్యాన్సర్) లతో నేడు బిగ్ బాస్ టీం ఒప్పందం చేసుకుంది. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరో ఒకసారి పరిశీలిద్దాం.

మొదటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగానే సీరియల్ నటుడు నిఖిల్ ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నాడు. అతనితో పాటుగా యాష్మి గౌడా, బెజవాడ బేబక్క, అభయ్ నవీన్, కిరాక్ శ్వేత, సౌమ్య రావు, అలీ సోదరుడు ఖయ్యుమ్, సింగర్ సాకేత్, అంజలి పవన్, రీతూ చౌదరి, ఇంద్రనీల్, సహార్ కృష్ణన్, న్యూస్ రీడర్ కళ్యాణి వంటి వారు కంటెస్టెంట్స్ గా ఖరారు అయ్యినట్టు తెలుస్తుంది. వీరిలో ఇంకా కొంతమంది అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యని వారు ఉన్నారు. వాళ్ళతో బిగ్ బాస్ యాజమాన్యం ఇంకా చర్చలు జరుపుతుంది. మరో రెండు రోజుల్లో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ చేయనున్నారు.