‘స‌ర్కారు వారి పాట’‌.. క‌థ‌లో కీల‌క‌మైన మార్పులు !

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా జ‌న‌వ‌రి నుంచి జ‌ర‌గాల్సిన అమెరికా షెడ్యూల్ వాయిదా ప‌డటంతో దర్శకుడు స్క్రిప్టుని మ‌రింత ప‌ర్‌ఫెక్ట్ గా తీర్చిదిద్దుకోవ‌డానికి క‌థ‌లో కొన్ని కీల‌క‌మైన మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క‌థ‌ మ‌హేష్ కి తొలిసారి వినిపించేట‌ప్పుడు ఇదో రివైంజ్ స్టోరీ అని.. త‌న త‌ల్లిని మోసం చేసిన ఓ వైట్ కాల‌ర్ నేర‌స్థుడ్ని ప‌ట్టుకోవ‌డానికి మహేష్ ఎలాంటి ప్ర‌య‌త్నం చేశాడు అనేది […]

Written By: admin, Updated On : December 10, 2020 1:05 pm
Follow us on


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా జ‌న‌వ‌రి నుంచి జ‌ర‌గాల్సిన అమెరికా షెడ్యూల్ వాయిదా ప‌డటంతో దర్శకుడు స్క్రిప్టుని మ‌రింత ప‌ర్‌ఫెక్ట్ గా తీర్చిదిద్దుకోవ‌డానికి క‌థ‌లో కొన్ని కీల‌క‌మైన మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క‌థ‌ మ‌హేష్ కి తొలిసారి వినిపించేట‌ప్పుడు ఇదో రివైంజ్ స్టోరీ అని.. త‌న త‌ల్లిని మోసం చేసిన ఓ వైట్ కాల‌ర్ నేర‌స్థుడ్ని ప‌ట్టుకోవ‌డానికి మహేష్ ఎలాంటి ప్ర‌య‌త్నం చేశాడు అనేది మెయిన్ పాయింట్ అట. ఈ పాయింట్ మ‌హేష్‌కి కూడా న‌చ్చిందని.. కానీ ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో, క‌థ‌ని, స్క్రిప్టుని పునః ప‌రిశీలించుకోవ‌డానికి అవ‌కాశం దక్కడంతో.. ఈ కథలో రివైంజ్ డ్రామా రొటీన్ ఫార్ములా అనిపిస్తుందేమో అనే అనుమానంతో కథలో నుండి త‌ల్లి పాత్ర‌ని పూర్తిగా తొలగించిన‌ట్టు తెలుస్తోంది.

Also Read: హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ లో మూడోసారి మహేష్ సత్తా

అయితే ఈ సినిమా కథ గురించి ఇప్పటికే మరో రూమర్ కూడా బలంగా వినిపిస్తోంది. బ్యాంకుల ద‌గ్గ‌ర నుంచి వంద‌ల కోట్లు అప్పు చేసి, విదేశాల‌కు చెక్కేసిన విజ‌య్ మాల్యా లాంటి వాళ్ల మెడ‌లు వంచిన ఓ హీరో క‌థ ఇదని.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా మొత్తం కేంద్రీకృతమైందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషించబోతున్నాడని.. ఇలా నిన్నటివరకూ ఈ సినిమా కథ పై అనేక రూమర్స్ వినిపించాయి. పైగా వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని కూడా ఆ రూమర్స్ లో వినిపించింది.

Also Read: నిహారిక కు చిరంజీవి కాస్ట్లీ గిఫ్ట్… ఏకంగా కోట్లలో..!

ఏది ఏమైనా ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి, ఈ చిత్రంలోని కథకు సంబంధించిన అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. వాటిల్లో ఎంత నిజం ఉంది అనేది టీమ్ కి తప్ప ఎవరికీ క్లారిటీ లేదు. ఇక మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీ ను నిర్మిస్తున్నాయి. అన్నట్లు ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్