Sandeep Reddy Vanga: రాజమౌళి ని డామినేట్ చేస్తున్న సందీప్ వంగ.. 7 మంది సూపర్ స్టార్స్ పడిగాపులు!

తీసింది కేవలం మూడు సినిమాలు మాత్రమే, ఆ మూడు సినిమాలతోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేకం చేసేసాడు. ముందుగా 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఆయన వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమాకి ముందు సందీప్ వంగ వృత్తి పరంగా డాక్టర్ గా కొనసాగేవాడు.

Written By: Vicky, Updated On : September 13, 2024 2:52 pm

Sandeep Reddy Vanga

Follow us on

Sandeep Reddy Vanga: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో రాజమౌళి ని మించిన డైరెక్టర్ లేదు. ఇది నిన్న మొన్నటి వరకు వినిపించిన మాట. ఎందుకంటే అంత స్కేల్ లో ఎవ్వరూ సినిమాలు తియ్యలేరు, తీసినా సక్సెస్ అవ్వలేరు అనేది కొందరి వాదన. కానీ ఇప్పుడు రెండు మూడు సినిమాల అనుభవం ఉన్నోళ్లు కూడా రాజమౌళి స్థాయిలో, ఆయన కంటే గొప్పగా అలోచించి సినిమాలు చేస్తున్నారు. సందీప్ వంగ, ప్రశాంత్ నీల్, నాగ అశ్విన్ వంటి యంగ్ డైరెక్టర్స్ రాజమౌళి కి సవాలు లాగా నిలిచారు. ఈ ముగ్గురు రాజమౌళి లాగా సంవత్సర కాలాలు సమయం తీసుకోరు. స్టార్ హీరోలు ఇచ్చిన డేట్స్ లోనే సినిమాని పూర్తి చేసి విడుదల చేస్తున్నారు, వేల కోట్లు కొల్లగొడుతున్నారు. వీరిలో ముఖ్యంగా మనం సందీప్ వంగ గురించి మాట్లాడుకోవాలి. యూత్ ఆడియన్స్ ఈయన సినిమా అంటే పిచ్చెక్కి పోతున్నారు.

తీసింది కేవలం మూడు సినిమాలు మాత్రమే, ఆ మూడు సినిమాలతోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేకం చేసేసాడు. ముందుగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఆయన వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమాకి ముందు సందీప్ వంగ వృత్తి పరంగా డాక్టర్ గా కొనసాగేవాడు. ఒక డాక్టర్ ఇంత వయొలెంట్ గా అలోచించి సినిమాలు చేయగలడా అని ఆడియన్స్ ఈ చిత్రం విడుదలైనప్పుడు ఆశ్చర్యపోయి చూసారు. ఇదే సినిమాని మళ్ళీ ఆయన బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసారు. అక్కడ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఒకే ఒక్క సినిమాతో బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక రీసెంట్ గా రణబీర్ కపూర్ తో ఆయన చేసిన ‘ఎనిమల్’ చిత్రం సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామి ని అంత తేలికగా ఎవరూ మర్చిపోరు. అడల్ట్ రేటెడ్ కంటెంట్ తో తీసిన ఈ చిత్రం దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంది. సందీప్ వంగ టాలెంట్ కి విమర్శకులు సైతం సెల్యూట్ చేసేలా చేసింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్స్ దగ్గర నుండి, బాలీవుడ్ స్టార్స్ వరకు సందీప్ వంగ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

రాజమౌళి కోసం కూడా ఇంతలా ఎవ్వరూ ఎదురు చూడడం లేదు. కానీ సందీప్ మాత్రం తాను అనుకున్న కమిట్మెంట్స్ అనుసరించే ముందుకు పోతున్నాడు. ప్రస్తుతం ఆయన ‘ఎనిమల్’ సీక్వెల్ ‘ఎనిమల్ పార్క్’ మూవీ షూటింగ్ కోసం సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే చిత్రం చేయబోతున్నాడు. ప్రభాస్ చిత్రం పూర్తి అవ్వగానే అల్లు అర్జున్ తో ఒక సినిమా ప్రారంభం కానుంది. ఇవి కాకుండా రీసెంట్ గా ధర్మ ప్రొడక్షన్స్ లో ఎన్టీఆర్ హీరో గా సందీప్ వంగ దర్శకత్వం లో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరూ సందీప్ వంగ డేట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు.