నా తండ్రిని వాళ్ళే చంపారు.. నటి ఆవేదన !

తన నటనతో ప్రేక్షకులను అలరించిన బుల్లితెర నటి ‘సంభావన సేత్‌’ ఇప్పుడు విలపిస్తున్నారు. ఇటీవల ఆమె తండ్రి కరోనాతో పోరాడి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే, తన తండ్రి మరణానికి కారణం కరోనా కాదు, ఆయనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు అంటూ ఆమె ఆరోపణలు చేస్తోంది. తన తండ్రికి ఆక్సిజన్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నప్పటికీ డాక్టర్లు సరిగ్గా పట్టించుకోలేదని, కేవలం వారి నిర్లక్ష్యం వల్లే నేను నా తండ్రిని కోల్పోయాను అని ఆమె ఆవేదనను వ్యక్తపరుస్తుంది. ఆమె […]

Written By: admin, Updated On : May 23, 2021 2:13 pm
Follow us on

తన నటనతో ప్రేక్షకులను అలరించిన బుల్లితెర నటి ‘సంభావన సేత్‌’ ఇప్పుడు విలపిస్తున్నారు. ఇటీవల ఆమె తండ్రి కరోనాతో పోరాడి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే, తన తండ్రి మరణానికి కారణం కరోనా కాదు, ఆయనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు అంటూ ఆమె ఆరోపణలు చేస్తోంది. తన తండ్రికి ఆక్సిజన్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నప్పటికీ డాక్టర్లు సరిగ్గా పట్టించుకోలేదని, కేవలం వారి నిర్లక్ష్యం వల్లే నేను నా తండ్రిని కోల్పోయాను అని ఆమె ఆవేదనను వ్యక్తపరుస్తుంది.

ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్‌ చేస్తూ.. ‘బాధతో చెబుతున్న విషయం ఇది. అందరు డాక్టర్లు దేవుళ్లు కాదు. డాక్టర్స్ లో మనలాంటి సామాన్యలను చంపేసే రాక్షసులు కూడా ఉన్నారు. అలాంటి డాక్టర్లే నా తండ్రిని చంపేశారు. ఎవరికైనా తండ్రిని కోల్పోవడం తీర్చలేని బాధ. నా జీవితంలో కూడా ఈ భయంకరమైన పరిస్థితి ఎదురైంది. కానీ నేను ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది.

నాకు నా తండ్రి నేర్పిన బాటలోనే నేను న్యాయం కోసం పోరాటం చేస్తాను. నిర్లక్ష్యపు డాక్టర్ల పై నేను చేసే ఈ పోరాటంలో నేను గెలిచినా గెలవకపోయినా కొందరి నీచమైన డాక్టర్లను కచ్చితంగా బయటకు లాగి వారి నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చూపిస్తాను. నా తండ్రి మరణానికి కారణమైన జైపూర్‌ గోల్డెన్‌ హాస్పిటల్ కి ఇప్పటికే లీగల్‌ నోటీసులు పంపించాము.

మీలో కూడా చాలామంది ఇలాంటి కష్టాన్ని ఎదుర్కొని ఉండి ఉంటే ముందుకు రండి. ఒక్కరే వాళ్లను ఎదురించలేకపోవచ్చు. అందరం కలిసి ఆ రాక్షసులకు శిక్ష పడేలా చేద్దాం. మా కుటుంబానికి జరిగినట్టు ఎవరికైనా అన్యాయం జరిగితే వారందరూ ఈ పోరాటానికి మద్దతు తెలపండి’ అంటూ ‘సంభావన సేత్‌ అభ్యర్థించింది.