Maa Inti Bangaram Break Even: కొంతకాలం విరామం తర్వాత సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను , ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ చిత్రం నుండి విడుదలైన ‘తస్సాదియ్యా’ పాటకు కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో , కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం అందరిలో వచ్చింది. ప్రామిసింగ్ కంటెంట్ తో పాటు , మంచి కాంబినేషన్ కూడా అవ్వడం తో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఒకవిధంగా చెప్పాలంటే బయ్యర్స్ రిస్క్ చేసారని చెప్పొచ్చు. అందుతున్న సమాచారం ప్రకారం , ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. కొంతమంది మీడియం రేంజ్ హీరోలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నమోదు అవ్వలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమాపై ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉంది అనేది. ఈ బుకింగ్స్ గ్రాస్ చూస్తుంటే , ఈ చిత్రానికి కచ్చితంగా మొదటి రోజు 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అవుతుందని అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మాత్రం కచ్చితంగా పాజిటివ్ టాక్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టాక్ బాగుంటే మాత్రం , ఈ చిత్రం వారం రోజులు పూర్తి అవ్వకముందే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోగలదు.
ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సమంత నిర్మాతగా కూడా వ్యవహరించింది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండు చిత్రాలు వచ్చాయి. అందులో ఒకటి జబర్దస్త్, ఇది కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది. కానీ రెండవ చిత్రం ‘ఓ బేబీ’ మాత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ సినిమా కారణంగానే, మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుంది అనగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా కీలక పాత్ర పోషించింది. సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి కథ ని అందించాడు.
