మెగా మేనల్లుడు పెళ్లి చేసుకోబోతున్నాడు

తెలుగు యువ హీరోల్లో పెళ్ళి ధ్యాస ఎక్కువై నట్టుంది. రీసెంట్ గా పెళ్ళికి సిద్దమై కరోనా కారణంగా ఆగిపోయిన వాళ్ళ లిస్టులో నితిన్ , నిఖిల్ ఉండగా తాజాగా మరో యువ హీరో వారితో జత కలవబోతున్నాడు. వన్ ఆఫ్ ది టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ఒకడైన మెగా మేనల్లుడు సాయి( ధరమ్ )తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాయితేజా మాటలు వింటుంటే త్వరలో పెళ్లి పీటలు ఎక్కే సూచనలు […]

Written By: admin, Updated On : May 5, 2020 12:01 pm
Follow us on


తెలుగు యువ హీరోల్లో పెళ్ళి ధ్యాస ఎక్కువై నట్టుంది. రీసెంట్ గా పెళ్ళికి సిద్దమై కరోనా కారణంగా ఆగిపోయిన వాళ్ళ లిస్టులో నితిన్ , నిఖిల్ ఉండగా తాజాగా మరో యువ హీరో వారితో జత కలవబోతున్నాడు. వన్ ఆఫ్ ది టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ఒకడైన మెగా మేనల్లుడు సాయి( ధరమ్ )తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాయితేజా మాటలు వింటుంటే త్వరలో పెళ్లి పీటలు ఎక్కే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

అష్ట దిగ్బంధనంలో నరసరావుపేట

కెరీర్ లో వరుస ప్లాప్ చిత్రాల్ని చవి చూసి ” చిత్రలహరి , ప్రతిరోజూ పండగే ” చిత్రాలతో మల్లి ఫార్మ్ లోకి వచ్చిన సాయితేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ `తనకు 33 ఏళ్లు వచ్చేశాయని… పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు గొడవ చేస్తున్నారని చెప్పాడు. పెళ్లి వద్దని ఇంటి నుంచి పారిపోవడం ఇక కష్టమే నని ` నవ్వుతూ తెలిపాడు. `ఈ ఏడాదే తన పెళ్లి ఉండొచ్చని, ఇంట్లో వాళ్లు అదే పనిలో ఉన్నారని చెప్పాడు. ఏమో.. అదృష్టం కలిసొస్తే ఈ ఏడాది ప్రేమలో పడతానేమో` అని సరదా వ్యాఖ్యలు కూడా చేశాడట… ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా లాక్ డౌన్ గురించి ప్రస్తావిస్తూ .”. స్కూల్ డేస్ తర్వాత ఇన్ని రోజులు ఇంటి వద్ద ఉండటం ఇదే ఫస్ట్ టైమ్ ” అని “ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే కరెక్ట్ ” అని ముగించాడట.