RRR Movie: తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సినిమా టికెట్టు ధరల తగ్గింపుపైనా పలు రకాలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఈ విషయంపై ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య స్పందించారు. టికెట్పై ధరలు తగ్గించడం సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. ఫలితంగా చిత్రబృందం త్వరలో కోర్టు మెట్లు ఎక్కుతుందంటూ గత కొన్ని రోజుల నుంచి వరుస కథనాలు సోషల్మీడియాలో వినిపించాయి.

ఇటువంటి వార్తలు వెలువడుతున్న క్రమంలో తాజాగా దానయ్య స్పందించారు. ఏపీలో సినిమా టికెట్టు ధరలు తగ్గిస్తే.. మా సినిమాపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే, ఈ విషయంపై న్యాయం కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరగదు. ఎపీ ముఖ్యమంత్రి జగన్ను కలిసి మా పరిస్థితిని తెలియజే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. దీనికి సరైన పరిష్కారం కావాలి. అని ట్విట్టర్ వేదికగా దానయ్య తెలిపారు.
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్, ఎమోషనల్ డ్రామా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రోమోలు, సాంగ్స్ సినిమాపై వేరే లెవెల్ అంచనాలు పెంచాయి. భారీ బడ్జెట్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.
డీవీవీ దానయ్య ఈ సినమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఆలియాభట్ ఒలీవియా మోరీస్ హీరోయిన్లు. శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్గణ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
