‘ఆర్ఆర్ఆర్’: భయపడుతున్న రాజమౌళి

వందల కోట్లు పెట్టి.. ఇద్దరు స్టార్ హీరోయిన్లతో ‘ఆర్ఆర్ఆర్’ తీసిన రాజమౌళి సైతం ఇప్పుడు భయపడుతున్నాడట.. బాహుబలి లాంటి గ్రాండ్ హిట్స్ తర్వాత తీసిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే కరోనాతో ఇప్పుడు ఈ సినిమా విడుదల ప్రశ్నార్దకంగా మారింది. ఇంత భారీ మూవీని చూడడానికి కరోనా భయంతో జనాలు రారు ఏమోనన్న భయం రాజమౌళిని తీవ్రంగా వెంటాడుతోందట.. 2021 దసరాకు విడుదలను అనౌన్స్ చేసినా రాజమౌళి ఇప్పుడు కరోనా భయంతో కలెక్షన్లకు దెబ్బపడుతుందని […]

Written By: NARESH, Updated On : June 8, 2021 10:29 pm
Follow us on

వందల కోట్లు పెట్టి.. ఇద్దరు స్టార్ హీరోయిన్లతో ‘ఆర్ఆర్ఆర్’ తీసిన రాజమౌళి సైతం ఇప్పుడు భయపడుతున్నాడట.. బాహుబలి లాంటి గ్రాండ్ హిట్స్ తర్వాత తీసిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే కరోనాతో ఇప్పుడు ఈ సినిమా విడుదల ప్రశ్నార్దకంగా మారింది. ఇంత భారీ మూవీని చూడడానికి కరోనా భయంతో జనాలు రారు ఏమోనన్న భయం రాజమౌళిని తీవ్రంగా వెంటాడుతోందట..

2021 దసరాకు విడుదలను అనౌన్స్ చేసినా రాజమౌళి ఇప్పుడు కరోనా భయంతో కలెక్షన్లకు దెబ్బపడుతుందని 2022 సమ్మర్ కు రిలీజ్ చేయడానికి సంవత్సరం గ్యాప్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారట..

ప్రస్తుతం మూడో వేవ్ దేశంలో వస్తుందని నిపుణులు ప్రకటించారు. ఆలోపు వ్యాక్సినేషన్ జరగడం కష్టమే. అందుకే ఈ ఏడాదిని పూర్తిగా పక్కనపెట్టాలని.. సంక్రాంతి 2022 కూడా వదిలేసి పూర్తిగా కరోనా తగ్గాక 2022 సమ్మర్ కు విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట..

రాజమౌళి 2022 సంక్రాంతిని వదిలేయాలని డిసైడ్ కావడంతో ఆ తేదీకి మహేష్ ‘సర్కార్ వారి పాట’ సహా రాధేశ్యామ్, పవన్ సినిమా, ఆచార్య ఇలా చాలా సినిమాలు లైన్లోకి వచ్చాయి. మొత్తంగా ఆర్ఆర్ఆర్ కలెక్షన్లకు దెబ్బపడకూడదనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.