రివ్యూ: ‘కార్తిక దీపం’ పరిస్థితి రివర్స్

తెలుగునాట అత్యధిక వ్యూయర్ షిప్ తో ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం’. ఈ సీరియల్ క్లైమాక్స్ కు వచ్చిందని.. వంటలక్క అయిన దీప చనిపోతుందని అందరూ భావించగా ట్విస్ట్ వచ్చింది. దీప బతికింది. కార్తీక్ కు చావుకొచ్చింది. దీప బతికి.. ఆమె పాతివత్యాన్ని గుర్తించిన కార్తీక్ కు ఆమె కాళ్లకు మొక్కి సారీ చెప్పాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. గతంలో తాగిన మత్తులో విలన్ అయిన ‘మోనిత’కు కడుపు చేశాడట.. మోనిత వచ్చి ఈ ఘట్టంలో […]

Written By: NARESH, Updated On : June 11, 2021 4:59 pm
Follow us on

తెలుగునాట అత్యధిక వ్యూయర్ షిప్ తో ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం’. ఈ సీరియల్ క్లైమాక్స్ కు వచ్చిందని.. వంటలక్క అయిన దీప చనిపోతుందని అందరూ భావించగా ట్విస్ట్ వచ్చింది. దీప బతికింది. కార్తీక్ కు చావుకొచ్చింది. దీప బతికి.. ఆమె పాతివత్యాన్ని గుర్తించిన కార్తీక్ కు ఆమె కాళ్లకు మొక్కి సారీ చెప్పాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. గతంలో తాగిన మత్తులో విలన్ అయిన ‘మోనిత’కు కడుపు చేశాడట.. మోనిత వచ్చి ఈ ఘట్టంలో తనకు కడుపు చేసిన కార్తీక్ ను నిలదీసే సరికి వంటలక్క ఇప్పుడు పతివ్రత కాగా… డాక్టర్ బాబు ప్రాతివత్యం పోయింది. ఇప్పుడు కథ మొత్తం రివర్స్ అయ్యిపోయింది. ఇన్నాళ్లు దీపకు ఎఫైర్ ఉందని కార్తీక్ నిలదీయగా.. ఇప్పుడు మోనితకు కడుపు చేసి ఎఫైర్ పెట్టుకున్న కార్తీక్ ప్రాతివత్యం పోయింది. దీంతో మొత్తం కథను రివర్స్ చేశారు. ఇదే ఇప్పుడు ప్రేక్షకులకు ట్విస్ట్ ఇచ్చినట్టైంది. దీనిపై సోషల్ మీడియాలో బోలెడు మీమ్స్ తయారు చేస్తున్నారు.

గురువారం రోజున కార్తిక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు కి వాళ్ల అమ్మ సౌందర్య కి మధ్య సంభాషణ జరుగుతుంది. కార్తిక్ ఇంటి పరువు తీసాడని తను మొదటి నుండి మోనిత ని నమ్మవద్దని చెప్పనని సౌందర్య అంటుంది. మోనిత గోతి కాడా నక్క లాగా కాచుకుకుర్చున్నది అని అంటుంది. దీప అగ్నిలో దూకి పతివ్రత గా నిరుపించుకుంటే ఇప్పుడు నీవు సరి దిద్దుకోలేని తప్ప చేసి నిలబడ్డావు అంటూ కార్తిక్ ని నిలదీస్తుంది.

మురళీకృష్ణ ఎలాంటి కొడుకుని కన్నవు అమ్మ అంటూ నిందించాడని సౌందర్య వాపోతుంది. ఎందుకంటే తన కూతురుకి అన్యాయం జరిగితే ఏ తండ్రి అయినా అలా అంటాడని చెబుతుంది. దీనికి కార్తిక్ తను నిజంగా దీప మీద ప్రేమ లేక ఈ తప్పు చేయలేదని తనకు తేలికుండానే జరిగిపోయింది మమ్మి అని తన రివాల్వర్ తో షూట్ చేయమని అంటాడు.

ఇక తండ్రి ఫాం హౌస్ నుండి పోన్ చేశాడని పిల్లలు ఇంటికి వస్తానని అంటున్నారని చెబుతుంది సౌందర్య. ఈ విషయం మీనాన్నా కి తెలిస్తే గుండె ఆగిపోతుందని అప్పుడు నాకే కాదా బాధ అని సౌందర్య కొడుకు కార్తీక్ తప్పును కప్పేస్తున్నట్టు చెబుతుంది. ఆ తర్వాత తిండి మానేసిన కార్తీక్ ను తీసుకెళ్లి భోజనం పెడుతుంది.

ఇంతలో పిల్లలు నవ్వులు వినిపిస్తాయి. శౌర్య, హిమ రాకతో అందరిలోనూ షాక్ వీళ్లు వచ్చిన ఆనందం ఎవరిలోనూ ఉండదు..వెంటనే ఆ పిల్లలు అమ్మేది అంటూ అడుగుతారు. అమ్మ పాత ఇంటికి పోయిందని చెప్పడంతో పిల్లలతో కలిసి కార్తీక్ ఆ ఇంటికే వెళ్లి అక్కడే ఉంటానంటాడు. దీనికి దీప అంగీకరిస్తుందా? లేదా ఎఫైర్ పెట్టుకున్న భర్తను వెళ్లగొడుతుందా? అన్నది వేచిచూడాలి. శుక్రవారం పిల్లలు కార్తిక్ దీప దగ్గరికి రావడంతో ట్విస్ట్ నెలకొంది.

ఇక ఈ ట్విస్ట్ పై సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తాయి. కార్తీక్, దీప కలిసిపోలేదని తెలిసి నెటిజన్లు సెటైర్లు వేశారు. ఈ సీరియల్ వాళ్లు కలవరా అంటూ వందల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.