Ram Charan: మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్… కెరియర్ మొదట్లోనే పరస విజయాలను అందుకున్న ఆయన ఆ తర్వాత టాప్ హీరోగా మారాడు. ముఖ్యంగా మగధీర సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ ను కొల్ల గొట్టిన మొదటి హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ రికార్డులను క్రియేట్ చేశాడు. మరి అలాంటి రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో కొంతవరకు తడబడుతున్నాడు. నిజానికి ఆయన నమ్మిన ముగ్గురు దర్శకులు అతన్ని దారుణంగా మోసం చేశారు… వాళ్లెవరూ అంటే మగధీర మూవీ తర్వాత ఆరెంజ్ మూవీతో బొమ్మరిల్లు భాస్కర్ అతన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
మూవీ కల్ట్ క్లాసికల్ గా మిగిలిపోయిన కూడా సక్సెస్ ల పరంగా ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మిగిల్చింది. ఇక వినయ విధేయ రామ సినిమాతో బోయపాటి శ్రీను సైతం తనకి భారీ విజయాన్ని అందిస్తాడు అనే ఆలోచనలో రాంచరణ్ ఉండేవాడు. కానీ బోయపాటి శ్రీనుతీసిన ‘వినయ విధేయ రామ’ మూవీ రామ్ చరణ్ కెరియర్ లోనే వరెస్ట్ మూవీగా నిలిచిందని చాలామంది చెబుతున్నారు…
ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన ‘గేమ్ చేంజర్’ సినిమా కూడా రామ్ చరణ్ కెరియర్ ని బాగా దెబ్బతీసింది. ‘త్రిబుల్ ఆర్’ సినిమా తర్వాత ఉన్న డేట్స్ అన్నింటిని గేమ్ చేంజర్ మీదే పెట్టిన రామ్ చరణ్ ఆ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తానని అనుకున్నాడు. కానీ శంకర్ మేకింగ్ సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేదు. కథ విషయంలో కూడా చాలా క్లారిటిని మిస్ అయ్యాడు. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఈ సినిమాతో చాలా వరకు నష్టపోయాడు.
ఇక ఆయన త్రిబుల్ ఆర్ రెంజ్ సక్సెస్ ని సాధించడానికి చాలా ప్రయత్నం చేశాడు. అయినప్పటికి తన దగ్గర ఉన్న నాసిరకం ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అంటూ చాలామంది విమర్శకులు సైతం కామెంట్లు చేశారు. మొత్తానికైతే పెద్ది సినిమాతో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని చాలా మంది రామ్ చరణ్ ను ప్రశంసిస్తుండటం నిజంగా చాలా గొప్ప విషయం….
