Ram Charan Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఒక రేంజ్ లో చేస్తున్నారు మేకర్స్. సోషల్ మీడియా లో తెరిచి చూస్తే ‘పెద్ది’ తప్ప మరొకటి కనిపించడం లేదు. ముఖ్యంగా యూట్యూబ్ ని ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే, పెద్ది ఇంటర్వ్యూ లే కనిపిస్తున్నాయి. ఆ రేంజ్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రీసెంట్ గానే రామ్ చరణ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన బొమ్మన్ ఇరానీ, దివ్యేన్దు లతో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో వీళ్ళ మధ్య జరిగిన సరదా సంభాషణ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగ్స్ భాగం ఎంతో ప్రత్యేకం , చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బుచ్చి బాబు ఏది కూడా ఒక పట్టాన సంతృప్తి చెందే మనిషి కాదని, అతను చాలా వరకు పర్ఫెక్షన్ కోరుకునే డైరెక్టర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన వాడు కాబట్టి , ఆ మాత్రం ఉండడం లో వింతేమీ లేదు. అయితే ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ కి ఎలివేషన్ ఇస్తూ , నటుడు బొమ్మన్ ఇరానీ చెప్పే క్రాస్ ఓవర్ ఆడ్లేట్ డైలాగ్ కోసం ఏకంగా 78 టేకులు తీసుకోవాల్సి వచ్చిందట. డైరెక్టర్ బుచ్చి బాబు ఆ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడని , నా సినీ కెరీర్ లో ఇన్ని టేకులు ఏ చిత్రానికి కూడా తీసుకోలేదని బొమ్మన్ ఇరానీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఒక్క డైలాగ్ కోసమే ఈ రేంజ్ లో కష్టపడ్డారంటే , ఇక సినిమా కోసం ఏ రేంజ్ లో కష్టపడి ఉంటారో అర్థం అవుతుందని , రామ్ చరణ్ ఎందుకు ఈ చిత్రం తన కెరీర్ లోనే నెంబర్ 1 గా నిలుస్తుందని చెప్పాడో ఇప్పుడు అర్థం అవుతుందని , జూన్ 4 న రామ్ చరణ్ నట విశ్వరూపం చూసి ఇండియా మొత్తం ఉలిక్కిపడే పరిస్థితి వస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఆ రేంజ్ లో ఉంటే మాత్రం కచ్చితంగా ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
