Peddi Success Event: 2024 వ సంవత్సరం, డిసెంబర్ న విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో కళ్లారా చూశాము . దాదాపుగా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. అయితే ఈ చిత్రం అప్పట్లో అనేక వివాదాలకు కూడా దారి తీసింది. సంధ్య థియేటర్ ప్రీమియర్ షో కి అల్లు అర్జున్ రావడం వల్ల, తొక్కిసలాట ఘటన జరిగి ఒక మహిళ చనిపోవడం , ఆమె బిడ్డ శ్రీతేజ్ అపస్మారక స్థితికి వెళ్లి , ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేకపోవడం వంటివి దురదృష్టకరమైన సంఘటనలు. ఇకపోతే సినిమా విడుదలైన మూడు రోజులకు మూవీ టీం ఒక సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు కూడా వివాదాలకు దారి తీశాయి.
ఆయన తన ప్రసంగం లో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తన పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించాడు అనే ప్రచారం కూడా చాలా బలంగా జరిగింది. అంతే కాదు మన ఆంధ్ర ప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ పేరుని కూడా ఆయన పక్కవాళ్ళను అడిగి తెలుసుకున్నాడు. సరిగ్గా ఇలాంటి సంఘటనే నిన్న హైదరాబాద్ లోని ‘పెద్ది’ సక్సెస్ ఈవెంట్ లో జరిగింది. ఆ చిత్ర హీరో రామ్ చరణ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతఙ్ఞతలు చెప్తూ , కందుల దుర్గేష్ పేరు మర్చిపోయారు, ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. రాష్ట్రాన్ని నడిపించే మంత్రుల పేర్లను రామ్ చరణ్ , అల్లు అర్జున్ వంటి స్థాయి ఉన్న సెలబ్రిటీలు మర్చిపోతే ఎలా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ కి ఎంతో సహకారం అందిస్తోంది , టిక్కెట్ రేట్స్ విషయం లో ఎలాంటి ఆంక్షలు పెట్టడం లేదు , అలాంటి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉన్నప్పుడు హీరోలు కూడా అదే స్థాయిలో గౌరవం ఇవ్వాలి అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట. అయితే రామ్ చరణ్ కి మొదటి నుండి పేర్లను మర్చిపోయే అలవాటు ఉంది. #RRR మూవీ కి సంబంధించి ఇచ్చిన అనేక ఇంటర్వ్యూస్ లో ఎన్టీఆర్, రాజమౌళి లు కూడా ఈ విషయాన్నీ ప్రస్తావించారు. కాబట్టి ఇది కావాలని దుర్గేష్ పేరు మర్చిపోయిన సందర్భం కాదని , నిజంగానే చరణ్ కి మతిమరుపు సమస్య ఉండడం వల్ల జరిగిన పొరపాటు అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ వివరణ ఇస్తున్నారు.
