Rajinikanth Annamalai Phone Call: మొన్ననే కదా తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని.. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని.. ఆ వయసు కూడా దాటిపోయిందని తలైవా రజనీకాంత్ చెప్పింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ని అభినందించింది.. కానీ ఇంతలోనే ఏం జరిగింది.. తమిళనాడులో ఏం జరుగుతోంది.. నిన్నటి వరకు విజయ్ చుట్టూ తిరిగిన రాజకీయాలు.. ఇప్పుడు ఎందుకు అన్నామలై వైపు వెళ్లిపోయాయి.. నిజానికి తమిళనాడు రాజకీయాలలో ఇప్పుడు ఏం జరుగుతోంది.. రాజీనామా చేసిన అన్నామలై ఏం చేయబోతున్నారు..
చాలా రోజుల నుంచి తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నయి.. ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి విజయ్ చుట్టూ అక్కడి రాజకీయాలు తిరిగాయి. ఇప్పుడు ఏకంగా అన్నామలై వైపు కేంద్రీకృతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు మీడియా నుంచి జాతీయ మీడియా వరకు ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అంతేకాదు, భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన అన్నామలై అనేక విషయాలను ఇప్పుడు బయటపెడుతున్నారు.
2024లో అన్నామలై ఐపీఎస్ అధికారిగా ఉండేవారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలలోకి రావాలని ఆయన నిర్ణయించుకున్నారు. అన్నామలై రాజీనామా చేస్తున్న విషయం రజినీకాంత్ కి తెలిసింది. దీంతో ఆయన అన్నామలై కి ఫోన్ చేశారు. అయితే అప్పటికే అన్నామలై బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు బీఎల్ సంతోష్ కు మాట ఇచ్చారు. అయితే రజనీకాంత్ ఫోన్ చేసి తాను నేతృత్వం వహించబోయే రాజకీయ ఉద్యమంలోకి రావాలని అన్నామలై కి ఆహ్వానం పలికారు. అయితే రజనీకాంత్ ఆఫర్ ను అన్నామలై తిరస్కరించారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి మెరుగైన ఓటు బ్యాంకు లభించేలా చేశారు.
ఇటీవలీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యవహరించిన తీరు అన్నామలై కి ఏమాత్రం నచ్చలేదు. దీంతో అభిప్రాయ బేధాలు వచ్చాయి. అందువల్లే ఆయన పార్టీకి రాజీనామా చేశారు.. కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం విషయంలో అన్నామలై సానుకూల ధోరణి అందుపుచ్చుకోలేకపోయారు. కాగా అన్నామలై మక్కల్ ఇయక్కం పేరుతో రాజకీయ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. దానికి తమిళనాడులో విశేషమైన స్పందన లభిస్తోంది.
