రాజమౌళి ఔట్.. మహేష్ నెక్ట్స్ మూవీ ‘త్రివిక్రమ్’తోనే?

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. పర్శురాం దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అమెరికాలో 45రోజులపాటు ఏకదాటిగా ఈ మూవీ షూటింగ్ నిర్వహించేలా చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ మూవీని కేవలం ఆరునెలల్లో పూర్తి చేయాలని మహేష్ దర్శకుడి సూచించినట్లు తెలుస్తోంది. ఈమేరకు చిత్రయూనిట్ అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోంది. Also Read: ఎక్స్ క్లూజివ్ : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా పోస్ట్ ఫోన్ […]

Written By: NARESH, Updated On : October 8, 2020 10:39 am
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారిపాట’. పర్శురాం దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అమెరికాలో 45రోజులపాటు ఏకదాటిగా ఈ మూవీ షూటింగ్ నిర్వహించేలా చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ మూవీని కేవలం ఆరునెలల్లో పూర్తి చేయాలని మహేష్ దర్శకుడి సూచించినట్లు తెలుస్తోంది. ఈమేరకు చిత్రయూనిట్ అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోంది.

Also Read: ఎక్స్ క్లూజివ్ : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా పోస్ట్ ఫోన్ !

ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు దర్శకుడు తివిక్రమ్(గురూజీ)తో కలిసి పని చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సంక్రాంతికి మహేష్ బాబు ‘సరిలేరునికెవ్వరు’తో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నారు. ఇక తివిక్రమ్ సైతం ‘అలవైకుంఠపురములో’తో సూపర్ హిట్టు అందుకున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా సంక్రాంతి రేసులో నిలిచి భారీ కలెక్షన్లు రాబట్టాయి.

తాజాగా మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘ఖలేజా’ మూవీ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్ బాబు ‘ఖలేజా’ సినిమా వర్కింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఖలేజా’ నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లి గురూజీపై ప్రశంసలు కురిపించారు. ‘ఖలేజా’ మూవీలో నటించడం వల్ల తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోగలిగానని మహేష్ తెలిపాడు. ఇక త్వరలోనే తమ కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుందని మహేష్ హింట్ ఇచ్చాడు.

మహేష్ బాబు దర్శకుడు రాజమౌళితో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే దీనికి చాలా సమయం పట్టేలా కన్పిస్తోంది. అదేవిధంగా దర్శకుడు తివిక్రమ్.. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ ఆలస్యం కారణంగా ఇప్పట్లో ఈ మూవీ ప్రారంభమయ్యేలా కన్పించడం లేదనే టాక్ విన్పిస్తోంది.

Also Read: మరీ ఇంత అన్యాయమా.. పాపం ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ !

మహేష్ ‘సర్కారువారిపాట’ పూర్తయిన వెంటనే దర్శకుడు త్రివిక్రమ్ తో మహేష్ నెక్ట్ మూవీ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఎన్టీఆర్ మూవీ కంటే ముందే మహేష్ మూవీ పట్టాలెక్కడం ఖాయంగా కన్పిస్తోంది. దశాబ్దం తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ రాబోతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.