Mahesh Rajamouli : మహేష్ బాబు సినిమాపై సంచలన ప్రకటన చేసిన రాజమౌళి

Mahesh Rajamouli : బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీపై ఇండస్ట్రీలో బోలెడు అంచనాలున్నాయి. ఇదో డిఫెరెంట్ జోనర్ అని.. ప్రపంచాన్ని చుట్టివచ్చే ఒక సాహసికుడి కథ అని ఇదివరకే రాజమౌళి చెప్పుకొచ్చాడు. తాజాగా మహేష్ బాబుతో సినిమాపై మరో సంచలన ప్రకటన చేశారు. మహేష్ అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. తమ తర్వాతి సినిమా ఎక్కడి వరకూ వచ్చిందో అప్టేట్ ఇచ్చి అందరినీ ఖుషీ చేశాడు.     […]

Written By: NARESH, Updated On : November 20, 2022 6:36 pm
Follow us on

Mahesh Rajamouli : బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీపై ఇండస్ట్రీలో బోలెడు అంచనాలున్నాయి. ఇదో డిఫెరెంట్ జోనర్ అని.. ప్రపంచాన్ని చుట్టివచ్చే ఒక సాహసికుడి కథ అని ఇదివరకే రాజమౌళి చెప్పుకొచ్చాడు. తాజాగా మహేష్ బాబుతో సినిమాపై మరో సంచలన ప్రకటన చేశారు. మహేష్ అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. తమ తర్వాతి సినిమా ఎక్కడి వరకూ వచ్చిందో అప్టేట్ ఇచ్చి అందరినీ ఖుషీ చేశాడు.

 

 

తాజాగా హాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా భావించే ‘గవర్నర్స్ అవార్డుల’ ప్రధానోత్సవంలో రాజమౌళి పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాజమౌళి తన కుమారుడు కార్తికేయతో కలిసి ఈ టూర్ లో ఉన్నారు. మహేష్ తండ్రి కృష్ణ అంత్యక్రియలకు కూడా రాజమౌళి ఇందుకే హాజరుకాలేకపోయాడు.

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ వేడుక ఆస్కార్స్ కు ముందు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులకు అకాడమీ అవార్డులను అందజేస్తారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి తీసిన రాజమౌళికి ఈ గవర్నర్ అవార్డుల్లో ప్రత్యేకంగా కొనియాడి అవార్డ్స్ ఇచ్చారు.

ఈ సందర్భంగా తన తర్వాత మహేష్ బాబుతో సినిమాపై రాజమౌళి ఓపెన్ అయ్యారు. ‘నేను దర్శకత్వం వహించిన చిత్రాల్లో చాలా వాటికి మా నాన్నే రచయిత. కొన్ని నెలల క్రితమే కథ రాయడం మొదలుపెట్టారు. ఆయన , నేను డెవలప్ మెంట్ పనుల్లో బిజీగా ఉన్నాం. ఇదొక అడ్వెంచర్ కథ. ఎంతో కాలం నుంచి ఈ జోనర్ లో సినిమా చేయాలని ఉంది. ‘ఇండియానా జోన్స్’ నాకు ఇష్టమైన సినిమా. ’ అంటూ మహేష్ బాబు సినిమా కూడా అలాంటిదేనని.. అలానే ఉండబోతోందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. దీంతో మహేష్-రాజమౌళి మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.